TDLP Meeting: చంద్రబాబు స్వీట్ వార్నింగ్..! తప్పు చేస్తే ఎవర్నీ వదిలిపెట్టం..
- ప్రజాప్రతినిధులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్..
- తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టం..
- కక్ష సాధింపులకు దిగితే.. వైసీపీకి మనకి తేడా ఉండదు..
- చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..
- ఏ కార్యకర్త తప్పు చేసినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDLP Meeting: టీడీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ప్రజాప్రతినిధులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని స్పష్టం చేసిన ఆయన.. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే.. వైసీపీకి మనకి తేడా లేదనుకుంటారని తెలిపారు.. అయితే, చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది.. అలాగే ఎన్డీఏలో ఉన్న ఏ కార్యకర్త తప్పు చేసినా.. ఎవరినైనా తిట్టినా.. సీఎంతో పాటు ప్రభుత్వంపై కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుందని హెచ్చరించారు.. ప్రధాని మోడీని చూసి అందరం నేర్చుకోవాలి.. ఆయన పట్టు దల వల్లే మూడు సార్లు పీఎం అయ్యారు.. గుజరాత్ లో ఆరు సార్లు గెలిచారు.. దేశంలో ఎవరికీ రాని విజయం మోడీకే వచ్చింది. దాని వెనుక కఠోర శ్రమ, క్రమశిక్షణ ఉంది.. ఎక్కడా ఆయనా తప్పు చేయలేదు.. ఆయన పార్టీని చేయనీయలేదు.. ఆ విషయాన్ని అందరం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.
Read Also: Fire Accident: ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. ఐసీయూలో రోగి మృతి
Also Read
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
- YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ఇక, వైసీపీ చేయని తప్పులు లేవు… ఎందుకు ఎన్నికల్లో 11 కు పడిపోయారని ఎద్దేవా చేశారు చంద్రబాబు.. మనం నిలబడ్డాం నిలదొక్కుకున్నాం.. 93 శాతం సీట్లు వచ్చాయంటే.. అందరం గుర్తు పెట్టుకోవాలి.. విదేశాల నుంచీ వచ్చి మరీ మనల్ని గెలిపించారు.. ఒక నాయకుడు జైలుకు వెళ్లాడు… ఒక నాయకుడు టార్చర్ అనుభవించాడని గుర్తుచేశారు.. ఏ కార్యకర్త తప్పు చేసిన అది సీఎం మీద పడుతుంది.. మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్టం చేసే అవకాశం ఉంది.. అంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. 7 శ్వేత పత్రాలు ముందుగానే ఇచ్చాం.. సహజవనరులు దోచుకున్నారు గత ప్రభుత్వంలో అన్నారు.. నిన్న హిందూపూర్ లో జరిగిన నేరం వెనుక గంజాయి బ్యాచ్ లే ఉన్నాయి.. FRBM లేదు… కొంతవరకూ కేంద్రం సహకరించింది కనుక నిలబడగలిగాం.. NDA కూటమి ఉంటే తప్ప మనం నిలబడే అవకాశం లేదు.. ఈ సమావేశం పట్ల రాష్ట్రం మొత్తం ఎందుకు ఆసక్తి కనబరుస్తోందో ప్రతీ ఒక్కరూ గ్రహించాలి.. చేసిన పనుల్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పార్టీ భవిష్యత్తు దృష్ట్యా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
Read Also: Kishan Reddy: మూసీ సుందరీ కరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చడం న్యాయం కాదు..
ఏ నమ్మకంతో ప్రజలు మనకు ఓటేశారో ఆ నమ్మకాన్ని అంతా నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు.. ఐదేళ్లు తీవ్రంగా నష్టపోయి, కష్టనష్టాలు ఎదుర్కొన్న కార్యకర్తల బాధను అర్థం చేసుకోవాలి.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా.. అధికారుల సహా వ్యవస్థలన్నీ నాశనమైన పరిణామాలు గతంలో చూడలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించటం, పరిమిత వనరుల కారణంగా అన్నీ సరిచేయటానికి సమయం పడుతోందన్న ఆయన.. ఏ శాఖలోనూ సరైన ఆడిట్ జరగలేదు.. కేంద్ర నిధుల్ని సైతం ఇష్టానుసారం మళ్లించేశారు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే భయంకరమైన యాక్ట్ తెచ్చారు అన్నారు.. అయితే, ప్రతీ నియోజకవర్గం లో ఒక అన్న క్యాంటీన్ రావాలి.. డిసెంబర్ నాటికి స్కిల్ సెన్సస్ అవుతుంది. నెల మొదట్లోనే పెన్షన్లు, జీతాలు ఇస్తున్నాం.. పాత మద్యం దోపిడీలుపై చర్యలు తీసుకుంటూనే కొత్త మద్యం పాలసీలు తెచ్చాం.. ఇసుక పాలసీ లో మార్పులు తెచ్చాం.. ఇప్పటికే మద్యం వ్యాపారాలలో ఉన్నావారు మినహా ఎవ్వరూ అందులోకి వెళ్ళకుండా డిసిప్లీన్ తో ఉండాలని స్పష్టం చేశారు.. విజయవాడ వరదల్లో రాత్రింబవళ్ళు పని చేసాం.. గత ప్రభుత్వం చేసిన సమస్యల వల్ల బుడమేరు కు ఫ్లడ్ వచ్చింది.. విజయవాడే ఒక చెరువులా మారిపోయిందని గుర్తుచేశారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..