AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. కర్ణాటక సీఎంతో ఏపీ మంత్రుల బృందం భేటీ
- ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు..
- సీఎం ఆదేశాల మేరకు బెంగళూరులో కేబినెట్ సబ్ కమిటీ పర్యటన..
- సీఎం సిద్ధారామయ్య, మంత్రి రామలింగారెడ్డి, రవాణా శాఖ అధికారులతో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Free Bus Scheme: ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే అందుబాటులోకి తెచ్చే విధంగా కసరత్తు జరుగుతోంది .. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటించింది.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఏపీ మంత్రులు.. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను విజయవంతంగా అమలుచేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు అభినందనలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, హోంమంత్రి అనిత.. బెంగళూరులోని శాంతినగర్ బస్ డిపోను పరిశీలించారు.. అనంతరం డిపోలోని కొత్త బస్ లు ఎక్కి ప్రయాణికులతో హోంమంత్రి ముచ్చటించారు. ఈ పథకం ద్వారా మహిళలకు కలిగిన లబ్ధి గురించి వారినే నేరుగా అడిగి తెలుసుకున్నారు.
Read Also: Seema Chintakaya: చీమ చింతకాయలతో ఎన్ని లాభాలో..!
Also Read
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ఆర్థిక లోటున్నా మహిళా సాధికారతకే మఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.. సూపర్ సిక్స్ హామీలలో కీలకమైన ఈ పథకం అమలులో భవిష్యత్ లో లోటుపాట్లు రాకూడదనే సీఎం ఆదేశాల ప్రకారం అధ్యయనం చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు. కర్ణాటక రవాణా శాఖ ఉన్నతాధికారులతో స్మార్ట్ టికెట్ విధానం గురించి చర్చించినట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం పథకాన్ని అమలుచేస్తోన్న తీరును అన్ని కోణాలలో నిశితంగా పరిశీలిస్తున్నట్లు హోంమంత్రి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణంపై కర్ణాటక రవాణా శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉన్నతాధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సందేహాలను అడిగి తెలుసుకున్నామన్నారు. ఈ సందర్భంగా జీరో, స్మార్ట్ టికెట్ విధానంపై చాలా వరకూ స్పష్టత వచ్చిందన్నారు. పథకం అమలు తొలిరోజుల్లో మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, ఇబ్బందులపై హోంమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఈ పథకానికి సంబంధించి సమగ్ర నివేదికను త్వరలోనే సీఎం చంద్రబాబుకు సమర్పించనున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు.
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!