ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం బెంగళూరులో పర్యటించింది.. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సహా రవాణా శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు ఏపీ మంత్రులు.. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ను విజయవంతంగా అమలుచేస్తున్న కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు అభినందనలు తెలిపారు.