Mangoes Procurement: మామిడి కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి.. ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..!
- మామిడి కొనుగోళ్లపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి..
- మంచి ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..
- ఇప్పటి వరకూ 3.08 లక్షల మెట్రిక్ టన్నుల పంట కొనుగోళ్లు..
- రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో కేజీ రూ.12 లకు కొనుగోలు..
- కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు రోజువారీ సమీక్ష..
Mangoes Procurement: తోతాపురి మామిడి రైతుల విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ఇప్పటి వరకూ 3,08,261 మెట్రిక్ టన్నుల మేర తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు రైతుల నుంచి కొనుగోలు చేశాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రాసెసింగ్ యూనిట్లు, పల్ప్ పరిశ్రమలు తమ సామర్ధ్యం మేరకు మామిడిని కొనుగోలు చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాలో 45 వేల మెట్రిక్ టన్నులు, అన్నమయ్య జిల్లాలో 16,400 మెట్రిక్ టన్నుల మేర మామిడి కొనుగోళ్లు జరిగాయి. ర్యాంపులు, మండీల ద్వారా మరో 81 వేల మెట్రిక్ టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు విక్రయించారు. మొత్తం 50,922 మంది రైతుల నుంచి మామిడి కొనుగోళ్లు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.
Read Also: Bhuvanagiri: అబార్షన్లకు అడ్డాగా మారిన భువనగిరి..? గాయత్రి ఆసుపత్రిపై SOT పోలీసుల సోదాలు..!
Also Read
- AP SSC Results 2026: ఇవాళే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఇలా చెక్ చేయండి..
- AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అజెండా..
- AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
- Chandrababu warning: పార్టీ నేతలకు చంద్రబాబు క్లాస్.. తప్పులు చేస్తే హెడ్లైన్స్లోకి వెళ్తారు అంటూ హెచ్చరిక
మొత్తంగా మామిడి రైతులకు సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.. మూడు జిల్లా కలెక్టరేట్లలోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మామిడి కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. రోజువారీగా మామిడి రైతుల నుంచి ఏ మేర కొనుగోళ్లు జరిగాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. మొత్తంగా ఈ సీజన్ లో 3,75,000 మెట్రిక్ టన్నుల మేర దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే కుప్పంలో మామిడి రైతులు, పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్ల ప్రతినిధులుతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు, పల్ప్ పరిశ్రమల యాజమాన్యాలకు దిశా నిర్దేశం చేశారు. రైతుల నుంచి యూనిట్ సామర్ధ్యం మేరకు మామిడి కాయలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆదేశించారు.
Read Also: Tollywood : లక్ అంటే ఇలా ఉండాలి.. జాక్ పాట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్
రైతులకు అదనంగా కేజీకి రూ.4 రూపాయల మద్దతు ధరను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ట్రేడర్లు కేజీకి రూ.8 చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా రైతులకు కేజీ మామిడికి రూ.12 ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్ప్ పరిశ్రమల వద్ద గత ఏడాది మిగిలి పోయిన ఉత్పత్తిని విక్రయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లే ఆగ్రో, కోకోకోలా, పెప్సీ తదితర సంస్థలు రైతుల నుంచి మామిడిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఆదేశించింది. అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మామిడి రైతును ఆదుకునేందుకు వీలుగా కేంద్రం రూ.130 కోట్లను విడుదల చేయాలని గతంలోనే లేఖ రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Rule Change: మే 1 నుండి న్యూ రూల్స్.. ఎల్పీజీ ధరల నుండి క్రెడిట్ కార్డుల వరకు ఏవేం మారనున్నాయంటే?
-
Kitchen Tips: వేసవిలో పప్పు త్వరగా పాడవుతుందా..? ఇలా చేస్తే ఉదయం వండినా రాత్రి వరకు ఫ్రెష్గా..!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Sunrisers Hyderabad: సన్రైజర్స్ హైదరాబాద్ చేతికి ఆరంజ్, పర్పుల్ క్యాప్స్.!
-
IMD Rain Aalert: దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?