CM Chandrababu: టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
- ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ.. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు..
- టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు.. కానీ, వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు..
- గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు.. అలాగే టీడీపీది స్వర్ణయుగం: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘనంగా టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోచంద్రబాబుతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.. పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు.. టీడీపీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది.. ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ముందుకెళ్లారు.. నేను ఆత్మ విశ్వాసంతో ముందుకు నడిచాను.. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ టీడీపీనే అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
Read Also: Trump-Modi: మోడీపై ట్రంప్ ప్రశంసలు.. తెలివైన వ్యక్తి అంటూ కితాబు
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఇక, ఒక ఆదర్శం కోసం పుట్టిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి మళ్లీ పుట్టరు.. టీడీపీ ఒక సంచలనం.. రాజకీయ అవసరం.. టీడీపీకి నేను టీమ్ లీడర్ ని మాత్రమే.. మనం వారసులం మాత్రమే కానీ.. పెత్తందార్లము కాదు అని చెప్పుకొచ్చారు. టీడీపీని లేకుండా చేస్తామని చాలా మంది చెప్పారు కానీ.. వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు అంటూ సెటైర్లు వేశారు. నాకు అప్లికేషన్లు పెట్టుకుంటే పదవులు రావు.. క్షేత్రస్థాయిలో పని చేసిన వారికే పదవులు దక్కుతాయనేది ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఇక, 43 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు చూశాం.. చాలా పార్టీలు వచ్చి కనుమరుగయ్యాయి.. గుప్తుల కాలం స్వర్ణయుగం అంటారు.. అలాగే టీడీపీది స్వర్ణయుగం.. ఎక్కడికక్కడ సోషల్ ఇంజనీరింగ్ చేసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rahul Ramakrishna : పవన్ కళ్యాణ్ పై అర్జున్ రెడ్డి యాక్టర్ విమర్శలు
-
IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
-
Best Investment Options: రూపాయి బలహీనత వేళ ఏ అసెట్లో పెట్టుబడి పెట్టాలి? గోల్డ్, ఎఫ్ డీలు లేదా రియల్ ఎస్టేట్..?
-
Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్
-
Kavitha: విద్యాశాఖపై సీఎం పట్టు కోల్పోయారు.. కవిత సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.