Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- కాలుష్య రహిత పుష్కరాలే లక్ష్యం
- 268 గ్రామాలు మోడల్ పంచాయతీలుగా
- 'సప్తర్షి పుష్కర్ ఘాట్'కు శ్రీకారం
- 75 వేల మందికి ఒకేసారి స్నాన సౌకర్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan : రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పర్యావరణహితంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కాలుష్య రహిత గోదావరి పుష్కరాల నిర్వహణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పవిత్రమైన గోదావరి నదిలోకి పంచాయతీల నుండి చుక్క మురుగు నీరు కూడా కలవకూడదని ఆయన అధికారులను ఆదేశించారు. జీరో లిక్విడ్ డిశ్చార్జి (వ్యర్థ జలాలు నదిలోకి విడుదల కాని) పంచాయతీల ఏర్పాటుతో గోదావరి పుష్కరాలకు మరింత శోభ రానుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
268 మోడల్ పంచాయతీలు.. మ్యాజిక్ డ్రెయిన్లతో శాశ్వత పరిష్కారం
గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఒక సమగ్రమైన వ్యూహాన్ని అమలు చేయబోతోంది. దీనిలో భాగంగా పుష్కర పరిసరాల్లోని 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామాల నుండి మురుగు నీరు నదిలోకి కలవకుండా నిరోధించడానికి ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతంలో పెదపెంకి వంటి గ్రామాలలో మంచి ఫలితాలను ఇచ్చిన మ్యాజిక్ డ్రెయిన్ల విధానాన్ని ఇక్కడ కూడా ఉపయోగించి, మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
- Police Transfers: పోలీస్ శాఖలో భారీగా బదిలీలు.. రెండేళ్లు పూర్తిచేసిన వారికి అవకాశం..
- Polavaram Project: పోలవరం ప్రాజెక్టుకు వరద ఉధృతి.. కొట్టుకుపోయిన పైపులు..
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
మునికూడలి ఘాట్కు ‘సప్తర్షి పుష్కర్ ఘాట్’గా నామకరణం
ఈ పుష్కరాలలో మునికూడలి పుష్కర ఘాట్ను ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి నమూనాగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఘాట్కు ‘సప్తర్షి పుష్కర్ ఘాట్’గా కొత్త నామకరణం చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దేశంలోనే మొట్టమొదటి జీరో లిక్విడ్ డిశ్చార్జి పంచాయతీగా మునికూడలిని నిలపడమే తమ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘాట్ వద్ద ఒకేసారి 75 వేల మంది భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పుష్కర స్నానం చేసేలా భారీ ఏర్పాట్లు చేయనున్నారు.
సమన్వయంతో పనులు.. భక్తులకు మౌలిక వసతులు
పుష్కర ఘాట్లు, పుష్కర నగర్లలో భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఘాట్ల విస్తరణతో పాటు వాహనాల నిలుపుదల (పార్కింగ్), వీధి దీపాలు, దుస్తులు మార్చుకునే గదులు (డ్రెస్సింగ్ రూమ్స్), రోడ్లు , డ్రెయినేజీల ఆధునీకరణ పనులను ముందస్తుగానే పూర్తి చేయనున్నారు. వాహనాల నిలుపుదల స్థలాల కోసం స్థానిక రైతుల సహకారాన్ని తీసుకోనున్నారు. ఈ పద్ధతిలో రైతులకు కూడా లబ్ధి చేకూర్చేలా, అక్కడ వచ్చే ఆదాయంలో వారికి తగిన వాటా కల్పించే యోచనలో ప్రభుత్వం ఉంది.
దీనితో పాటు దేవాదాయ శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రధాన ఘాట్లలో ప్రత్యేకంగా ‘గోదావరి హారతి’ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన సోమేశ్వరాలయం, వేణుగోపాల స్వామి ఆలయాల ఆధునీకరణ పనులను కూడా వేగవంతం చేయనున్నారు. రాబోయే క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే తాను స్వయంగా మునికూడలి ఘాట్ను సందర్శించి పనుల పురోగతిని పరిశీలిస్తానని డిప్యూటీ సీఎం తెలిపారు. పుష్కరాల నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
TMC Crisis: మమతా బెనర్జీకి షాక్.. బీజేపీలోకి మాజీ టీఎంసీ ఎంపీలు..
-
CJP: పార్లమెంట్ మార్చ్.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియలు పూర్తి.. ట్రంప్నకు వ్యతిరేకంగా నినాదాలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
-
Bihar Politics: ఆర్జేడీలో ఇంటిపోరు.. నాపై చర్య తీసుకోవాలని లాలూ కుమార్తె సవాల్..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!