Adimulapu Suresh: శవాలపై రాజకీయం చేయడం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh Fires On Chandrababu Naidu: టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చవకబారు రాజకీయాలు అందరికీ తెలుసని మండిపడ్డారు. పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వటానికి మీరు వ్యతిరేకమా? పేదలకు భూములు ఇవ్వవద్దని చట్టం తెస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన చేశారని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. సీఆర్దీఏ చట్టం ప్రకారమే పేదలకు భూములు అందజేయాలని జగన్ అనుకున్నారని అన్నారు. అమరావతిలో కేవలం ధనికులే ఉండాలా అని నిలదీశారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
పేదలకు మంచి జరుగుతుందనుకుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయినా తాము వెనక్కు తగ్గేది లేదని, అన్నీ అనుమతులు తీసుకుని ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు శవాలపై రాజకీయం చేయటం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చే ముందు.. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి రావాలని కోరామన్నారు. ఆయన పర్యటన సమయంలో శాంతియుతంగా నిరసన తెలపాలని అనుకున్నామన్నారు. అయితే.. తమ క్యాంప్ ఆఫీస్ దగ్గరకు రాగానే, చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారన్నారు. రాళ్లు ఎవరు నువ్వారో అందరూ చూశారని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని చెప్పారు.
GVL Narasimha Rao: కొడాలి నానిపై జీవీఎల్ పరోక్ష కామెంట్లు.. నోరు అదుపులో పెట్టుకోవాలి
అంతకుముందు.. అమరావతి లో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆదిమూలపు సురేష్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులో కేసులు వేశారని, అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారన్నారు. త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!