Adimulapu Suresh: శవాలపై రాజకీయం చేయడం.. చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh Fires On Chandrababu Naidu: టీడీసీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు చవకబారు రాజకీయాలు అందరికీ తెలుసని మండిపడ్డారు. పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వటానికి మీరు వ్యతిరేకమా? పేదలకు భూములు ఇవ్వవద్దని చట్టం తెస్తారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అమరావతిలో పేదలకు భూములు ఇవ్వాలని సీఎం జగన్ ఆలోచన చేశారని, రాజ్యాంగ వ్యతిరేకంగా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. సీఆర్దీఏ చట్టం ప్రకారమే పేదలకు భూములు అందజేయాలని జగన్ అనుకున్నారని అన్నారు. అమరావతిలో కేవలం ధనికులే ఉండాలా అని నిలదీశారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
పేదలకు మంచి జరుగుతుందనుకుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. అయినా తాము వెనక్కు తగ్గేది లేదని, అన్నీ అనుమతులు తీసుకుని ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. చంద్రబాబుకు శవాలపై రాజకీయం చేయటం వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చే ముందు.. దళితులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి రావాలని కోరామన్నారు. ఆయన పర్యటన సమయంలో శాంతియుతంగా నిరసన తెలపాలని అనుకున్నామన్నారు. అయితే.. తమ క్యాంప్ ఆఫీస్ దగ్గరకు రాగానే, చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. వాళ్ళు ఉద్దేశ్యపూర్వకంగా దాడి చేశారన్నారు. రాళ్లు ఎవరు నువ్వారో అందరూ చూశారని, ఈ ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని చెప్పారు.
GVL Narasimha Rao: కొడాలి నానిపై జీవీఎల్ పరోక్ష కామెంట్లు.. నోరు అదుపులో పెట్టుకోవాలి
అంతకుముందు.. అమరావతి లో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఆదిమూలపు సురేష్ అన్నారు. పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఎంత దూరమైనా వెళ్తామని తెలిపారు. అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టులో కేసులు వేశారని, అమరావతి రైతుల ముసుగులో టీడీపీ నాయకులు కోర్టులో కేసులు వేశారని ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూశారన్నారు. త్వరలోనే అమరావతిలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.
Sajjala : ఎంపీ అవినాష్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు..
తాజావార్తలు
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
-
2027 ODI World Cup: ప్రపంచ కప్కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్కు బిగ్ షాక్!
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!