Tirumala Accident: తిరుమల ఘాట్ రోడ్లో యాక్సిడెంట్… ఐదుగురు భక్తులకు గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Ghat Road Accident: తిరుమల ఘాట్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు గాయపడ్డారు. అయితే ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఐదుగురు భక్తులు గాయపడ్డారు. మంగళవారం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతుండగా ప్రమాదం జరిగింది. తిరుమల ఏడుకొండలపైకి వెళుతుండగా ఘాట్ రోడ్డుపై టెంపో వాహనం అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టింది. తమిళనాడుకు చెందిన కొందరు భక్తులు టెంపో వాహనంలో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా 13వ మలుపు వద్ద టెంపో అదుపుతప్పి రెయిలింగ్ ను ఢీకొట్టి ఆగింది. దీంతో వాహనంలోని ఐదుగురు భక్తులు గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే టీటీడీ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించారు. ఘాట్ రోడ్డుపై ట్రాఫిక్ నిలిచిపోకుండా ప్రమాదానికి గురయిన టెంపోను అక్కడినుండి వెంటనే తరలించారు.
Read also:
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
టెంపో రెయిలింగ్ ను ఢీకొని ఆగడంతో పెనుప్రమాదం తప్పిందని.. టెంపో రెయిలింగ్ను దాటుకుని ముందుకు వెళ్లివుంటే లోయలో పడిపోయేదని ప్రత్యక్షసాక్షులు.. టెంపోలో ప్రయాణించిన ప్రయాణీకులు చెబుతున్నారు. రెయిలింగ్ను ఢీకొని ఆగిపోవడం మూలంగానే అందులోని భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా భక్తులు సురక్షితంగా బయటపడ్డారని వారంటున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తిరుమల కొండపైకి వెళ్లేదారిలో చిరుతల సంచారం కలకలం రేపుతుండటంతో.. టీటీడీ, అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ చిరుత చేపట్టిన విషయం తెలిసిందే. తిరుమల కొండలపై గల అడవుల్లో బోన్లు ఏర్పాటుచేసి చిరుతలను పట్టుకుంటున్నారు అధికారులు. కేవలం మూడురోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు అధికారులు ఏర్పాటుచేసిన బోనులో పడ్డాయి. ఇటు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న టీటీడీ అధికారులు అటు వన్యమృగాల మూలంగానూ ఎటువంటి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా ఉండటానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?