Betting : ఐపీఎల్ బెట్టింగ్.. అప్పు తీర్చలేక యువకుడి సూసైడ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ఫ్యాన్స్ ను జోష్ లో ముంచేస్తుంది. రోజుకో ట్విస్ట్.. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఒక వైపు క్రికెట్ ను ఎంజాయ్ చేస్తుంటే.. మరో వైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం పందెలు పెడుతున్నారు. పందేం రాయుళ్లపై పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసిన వారు తీరు మాత్రం మారడం లేదు. కొంతమంది బెట్టింగ్ పెట్టేందుకు అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు.. మరికొందరు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే చేసుకుంటున్నారు. అయితే తాజాగా క్రికెట్ బెట్టింగ్ తో అప్పుల పాలైన ఓ యువకుడు వాటిని తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. అనకాపల్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Also Read : Temple Thief: సిద్దిపేట పోచమ్మ ఆలయంలో చోరీ.. హుండీ పటలగొట్టి..
Also Read
- Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
- Fuel Shortage: పెట్రోల్ బంక్లకు మంత్రి నాదెండ్ల వార్నింగ్..
- AP Education Department: టీచర్ పోస్టుల సర్దుబాటుపై ఫోకస్ పెట్టిన విద్యాశాఖ.. బదిలీల్లో ట్విస్ట్..!
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
అనకాపల్లి జిల్లాలోని దిబ్బలపాలెం గ్రామానికి చెందిన పెంటకోట మధుకుమార్ ( 20 ) అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్నాడు. క్రికెట్ బెట్టింగ్ లు కట్టే అలవాటున్న మధుకుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పందేల కోసం అదే గ్రామానికి చెందిన పెంటకోట నర్సింగరావు వద్ద అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చాలంటూ అతడి నుంచి ఒత్తిడి పెరిగింది. అయితే, తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఈ నెల 23న రాత్రి ఎలుకల మందు తాగిన మధుకుమార్ ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Aishwarya Rai : అవి కనిపించకుండా కవర్ చేస్తున్న ఐశ్వర్య రాయ్
బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చేలేక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి మృతుడి తల్లి జయ, గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై అంజిబాబు వెల్లడించారు. అయితే మృతుడి తల్లి జయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంటకోట నర్సింగరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్ఐ అంజిబాబు వెల్లడించారు.
తాజావార్తలు
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో