Botsa Satyanarayana: 13 నెలలు గడిచినా.. చంద్రబాబు, పవన్ హామీల అమలెప్పటికి..?
- 13 నెలలు గడిచినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పిన హామీలను అమలు లేదు..
- ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి హామీలు అమలు చేయించే బాధ్యత వైసీపీ పార్టీది..
- కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోను బిరువాలో పెట్టారు: ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో శాసనమండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, రీజనల్ కో-ఆర్డినేటర్ కురుసాల కన్నబాబుతో పాటు అరకు ఎంపీ గుమ్మ తనూజ రాణి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ మంత్రులు పాముల పుష్పా శ్రీవాణి, పీడిక రాజన్న దొర, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో రెండు పక్షాలు ఉంటాయి.. ఒకటి అధికార పక్షం, రెండొది ప్రతి పక్షం.. ప్రతిపక్షం బాధ్యత ప్రజలు పడుతున్న ఇబ్బందులపై గొంతుగా నిలవడం.. ఇచ్చిన హామీలపై నిలదీయడమే మా బాధ్యత.. అమలు కానీ హామీలపై అడిగితే కేసులు పెట్టడం, నలకమందం అనడం సంప్రదాయం కాదు అని బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Rising Fear of Marriage: భర్తలను చంపుతున్న భార్యలు.. ఇంత కృరంగా ఎందుకు మారుతున్నారు?
Also Read
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Home Minister Anitha: విశాఖలో జగన్ పర్యటనపై హోంమంత్రి కౌంటర్.. మీకు ఆ హక్కు లేదు..!
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
ఇక, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి త్రికరణశుద్ధితో చెప్పిన హామీలు.. 13 నెలలు అయినా ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరుపున అడిగే హక్కు ఉంది.. ప్రజల చేత నడ్డి ఇరకొట్టించి అమలు చేయించే బాధ్యత మా పార్టీకి ఉందన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామీణ స్థాయిలో ఈ ప్రభుత్వ మోసాలను నిలదీస్తాం.. ఏడాది పాలనలో ఉన్న ఉద్యోగాలు తీసి నిరుద్యోగ భృతి మాట లేకుండా చేశారని మండిపడ్డారు. ఏడాది నుంచి నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి రూ. 36 వేలు ఎప్పుడు ఇస్తారని అడిగారు. మా ప్రభుత్వంలో హామీల అమలు కోసం మేనిఫెస్టోను జోబులో పెట్టుకుని తిరిగితే.. కుటమి నాయకులు అమలు చేయాలేక వారి మేనిఫెస్టోను బిరువాలో పెట్టారని బొత్స ఆరోపించారు.
Read Also: Nehal Modi: పీఎన్బీ బ్యాంకు మోసం కేసు, అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్..
ఇక, పువ్వు పుట్టగానే పరుమలించినట్లు లోకేష్ మంత్రి అయ్యారు అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. తండ్రికి మించిన అబద్ధాలు లోకేష్ మాట్లాడుతున్నారు.. అన్నదాత సుఖీభవ కార్యక్రమం పేరు గొప్పగా ఊరు దిబ్బల ఉందన్నారు. ఏడాది పుర్తి అయినప్పటికీ కేంద్రం ఇచ్చిన సాయం తప్ప రాష్ట్రం ఇప్పటి వరకు హామీని అమలు చేయలేదని తెలిపింది. ప్రజల సాక్షిగా మే నెలలో పథకాలు అమలు చేస్తామని చెప్పిన మంత్రి లోకేష్ ఏ మే నెలలో ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థులపై ఆడపిల్లలు, చిన్న పిల్లలు అని చూడకుండా లాఠీ ఛార్జ్ చేయడం ధర్మం కాదన్నారు. ఏం చేసిన అడిగే వారే లేరని ఇష్టానుసారంగా వ్వవహారిచండం సరికాదు అన్నారు. చంద్రబాబు ఎప్పుడు రైతులు, మహిళాలనే మోసం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారని ఎమ్మెల్సీ బొత్స విమర్శించారు.
తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!