Viral News : వడదెబ్బతో షాకింగ్ ఘటన..! పెట్రోల్ బంకులో నగ్నంగా వ్యక్తి
- ఎండ తీవ్రతతో షాకింగ్ ఘటన థాయిలాండ్లో
- స్పృహ కోల్పోయి నగ్నంగా పెట్రోల్ బంకులోకి వ్యక్తి
- వడదెబ్బతో మానసిక స్థితి మారే ప్రమాదం
- ఎండల్లో ప్రయాణాలపై అధికారుల హెచ్చరికలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భానుడి భగభగలకు మనుషులు ప్రాణాపాయ స్థితికి చేరుకోవడమే కాకుండా, ఒక్కోసారి వారి మానసిక స్థితి కూడా తలకిందులవుతుందని నిరూపించే ఘటన ఒకటి థాయిలాండ్లో వెలుగుచూసింది. ఖోన్ కేన్ ప్రాంతంలో ఒక వ్యక్తి తీవ్రమైన ఎండలో సుదీర్ఘకాలం ప్రయాణించి, చివరకు మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో నగ్నంగా పెట్రోల్ బంకులోకి రావడంతో స్థానికులు షాక్కు గురయ్యారు.
బాధితుడు తన మోటార్సైకిల్పై వివిధ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ వస్తున్నాడు. ఆ సమయంలో ఎండ తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. చాలా సేపు ఎండలో ప్రయాణించడం, శరీరంలో నీటి శాతం తగ్గిపోవడంతో అతను తీవ్ర అసహనానికి లోనయ్యాడు. సరిగ్గా ఒక పెట్రోల్ బంకు సమీపానికి వచ్చేసరికి అతని బైక్లో ఇంధనం (పెట్రోల్) అయిపోయింది.
Also Read
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. లక్షల కోట్ల సంపద ఆవిరి
బైక్ ఆగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఆ వ్యక్తి, తీవ్రమైన వేడి ధాటికి తనపై తనకు నియంత్రణ కోల్పోయాడు. ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పేసి, దిగంబరంగా పెట్రోల్ బంకులోకి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసిన అక్కడి సిబ్బంది, వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురై దూరం జరిగారు. అతను ఎవరితోనూ మాట్లాడలేక, ఏం జరుగుతుందో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు అతనికి ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, ఎండలో విశ్రాంతి లేకుండా ప్రయాణించడం వల్లే అతనికి ‘హీట్ స్ట్రోక్’ (వడదెబ్బ) తగిలి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. వడదెబ్బ తగిలినప్పుడు మెదడు పనితీరు మందగించి, మనుషులు తమ ప్రవర్తనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేసే వారు తగినంత నీరు తాగాలని, నీడ ఉన్న చోట విశ్రాంతి తీసుకోవాలని కోరారు. ఏ మాత్రం అశ్రద్ధ చేసినా అది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక స్థితిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Silent Signs Of Stress: ఒత్తిడిని కనిపెట్టడం ఎలా..? శరీరమిచ్చే సంకేతాలివే..
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!