Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు
- పది వేల రూపాయల జీతగాడికి రూ. 2కోట్ల పన్ను
- పన్ను కట్టాలని నోటీసులు
- ఏం అర్థకాక సతమతమవుతున్న బీద కూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని గయా జిల్లాలో ఓ పేద కూలీకి ఆదాయపు పన్ను శాఖ రూ.2 కోట్లకు పైగా పన్ను నోటీసులిచ్చిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చమురు వ్యాపారి వద్ద నెలకు రూ.10 వేల చొప్పున కూలీగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ వర్మకు రూ.2 కోట్ల 3 వేల 308 పన్ను చెల్లించాలని నోటీసు వచ్చింది. రూ. 67 లక్షల జరిమానా కూడా 2 రోజుల్లో చెల్లించాలని నోటీసులో పేర్కొంది. రాజీవ్ ఎప్పుడూ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని తేలడంతో విషయం మరింత క్లిష్టంగా మారింది. ఇంత తక్కువ ఆదాయంతో రిటర్నులు దాఖలు చేయడం కూడా తనకు తెలియదని బాధితుడు అంటున్నాడు.
READ MORE: Ra Macha : రా మచ్చా.. రామ్ అచ్చా!
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
రూ.2 కోట్ల నోటీసు ఎందుకు వచ్చాయి?
వాస్తవానికి.. 2015లో రాజీవ్ కార్పొరేషన్ బ్యాంక్లో రూ. 2 లక్షల ఎఫ్డి చేసినట్లు తెలిపాడు. అతనకు అత్యవసరం పడటంతో 2016లో ఈ ఎఫ్డీని బ్రేక్ చేసి నగదు తిరిగి తీసుకున్నాడు. దీని తర్వాత పాత గోదాములో పనిచేయడం ప్రారంభించాడు. అయితే అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ రూ. 2 కోట్ల 3 వేల 308 పన్ను నోటీసు పంపి అతని సమస్యలను పెంచింది. 2015-16లో రాజీవ్ రూ.2 కోట్ల ఎఫ్డీ చేశాడని, ఆ పన్ను ఇంకా చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది.
READ MORE:Devara : ముందు నుంచీ స్లో పాయిజనే అబ్బా!!!
గత నాలుగు రోజులుగా పనికి వెళ్లేందుకు జంకుతున్న బాధితుడు
ఆదాయపు పన్ను శాఖ నోటీసు రాజీవ్ జీవితంలో పెను తుఫాను తెచ్చింది. గత 4 రోజులుగా పనికి వెళ్లడం లేదు. విసుగు చెందిన అతను గయాలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ అధికారులు పాట్నాకు వెళ్లమని తనకు సూచించారు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పన్ను శ్లాబ్లో తక్కువగా ఉన్న ఒక పేద వ్యక్తికి రూ. 2 కోట్లకు పైగా పన్ను నోటీసు పంపబడింది. మరి ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, రాజీవ్కు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Rahul Gandhi: యూపీఐ ఛార్జీలపై రాహుల్గాంధీ విమర్శలు
-
IND vs WI 2026: మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్ల షెడ్యూల్ విడుదల.. సెప్టెంబర్ 27 నుంచే..
-
Faaah : ‘ఫాహ్..’ వైరల్ సౌండ్ వెనుక ఉన్నది టాలీవుడ్ లెజెండరీ కమెడియనా?.. అసలు నిజం ఇదిగో!
-
Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
-
Mandadi : ‘మండాడి’కి కలెక్షన్స్ వర్షం.. ఇద్దరు కమెడియన్లు ఎంత కొల్లగొట్టారంటే?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?