Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు
- పది వేల రూపాయల జీతగాడికి రూ. 2కోట్ల పన్ను
- పన్ను కట్టాలని నోటీసులు
- ఏం అర్థకాక సతమతమవుతున్న బీద కూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని గయా జిల్లాలో ఓ పేద కూలీకి ఆదాయపు పన్ను శాఖ రూ.2 కోట్లకు పైగా పన్ను నోటీసులిచ్చిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చమురు వ్యాపారి వద్ద నెలకు రూ.10 వేల చొప్పున కూలీగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ వర్మకు రూ.2 కోట్ల 3 వేల 308 పన్ను చెల్లించాలని నోటీసు వచ్చింది. రూ. 67 లక్షల జరిమానా కూడా 2 రోజుల్లో చెల్లించాలని నోటీసులో పేర్కొంది. రాజీవ్ ఎప్పుడూ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని తేలడంతో విషయం మరింత క్లిష్టంగా మారింది. ఇంత తక్కువ ఆదాయంతో రిటర్నులు దాఖలు చేయడం కూడా తనకు తెలియదని బాధితుడు అంటున్నాడు.
READ MORE: Ra Macha : రా మచ్చా.. రామ్ అచ్చా!
Also Read
రూ.2 కోట్ల నోటీసు ఎందుకు వచ్చాయి?
వాస్తవానికి.. 2015లో రాజీవ్ కార్పొరేషన్ బ్యాంక్లో రూ. 2 లక్షల ఎఫ్డి చేసినట్లు తెలిపాడు. అతనకు అత్యవసరం పడటంతో 2016లో ఈ ఎఫ్డీని బ్రేక్ చేసి నగదు తిరిగి తీసుకున్నాడు. దీని తర్వాత పాత గోదాములో పనిచేయడం ప్రారంభించాడు. అయితే అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ రూ. 2 కోట్ల 3 వేల 308 పన్ను నోటీసు పంపి అతని సమస్యలను పెంచింది. 2015-16లో రాజీవ్ రూ.2 కోట్ల ఎఫ్డీ చేశాడని, ఆ పన్ను ఇంకా చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది.
READ MORE:Devara : ముందు నుంచీ స్లో పాయిజనే అబ్బా!!!
గత నాలుగు రోజులుగా పనికి వెళ్లేందుకు జంకుతున్న బాధితుడు
ఆదాయపు పన్ను శాఖ నోటీసు రాజీవ్ జీవితంలో పెను తుఫాను తెచ్చింది. గత 4 రోజులుగా పనికి వెళ్లడం లేదు. విసుగు చెందిన అతను గయాలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ అధికారులు పాట్నాకు వెళ్లమని తనకు సూచించారు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పన్ను శ్లాబ్లో తక్కువగా ఉన్న ఒక పేద వ్యక్తికి రూ. 2 కోట్లకు పైగా పన్ను నోటీసు పంపబడింది. మరి ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, రాజీవ్కు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!