Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు
- పది వేల రూపాయల జీతగాడికి రూ. 2కోట్ల పన్ను
- పన్ను కట్టాలని నోటీసులు
- ఏం అర్థకాక సతమతమవుతున్న బీద కూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని గయా జిల్లాలో ఓ పేద కూలీకి ఆదాయపు పన్ను శాఖ రూ.2 కోట్లకు పైగా పన్ను నోటీసులిచ్చిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చమురు వ్యాపారి వద్ద నెలకు రూ.10 వేల చొప్పున కూలీగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ వర్మకు రూ.2 కోట్ల 3 వేల 308 పన్ను చెల్లించాలని నోటీసు వచ్చింది. రూ. 67 లక్షల జరిమానా కూడా 2 రోజుల్లో చెల్లించాలని నోటీసులో పేర్కొంది. రాజీవ్ ఎప్పుడూ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని తేలడంతో విషయం మరింత క్లిష్టంగా మారింది. ఇంత తక్కువ ఆదాయంతో రిటర్నులు దాఖలు చేయడం కూడా తనకు తెలియదని బాధితుడు అంటున్నాడు.
READ MORE: Ra Macha : రా మచ్చా.. రామ్ అచ్చా!
Also Read
- Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
- Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
రూ.2 కోట్ల నోటీసు ఎందుకు వచ్చాయి?
వాస్తవానికి.. 2015లో రాజీవ్ కార్పొరేషన్ బ్యాంక్లో రూ. 2 లక్షల ఎఫ్డి చేసినట్లు తెలిపాడు. అతనకు అత్యవసరం పడటంతో 2016లో ఈ ఎఫ్డీని బ్రేక్ చేసి నగదు తిరిగి తీసుకున్నాడు. దీని తర్వాత పాత గోదాములో పనిచేయడం ప్రారంభించాడు. అయితే అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ రూ. 2 కోట్ల 3 వేల 308 పన్ను నోటీసు పంపి అతని సమస్యలను పెంచింది. 2015-16లో రాజీవ్ రూ.2 కోట్ల ఎఫ్డీ చేశాడని, ఆ పన్ను ఇంకా చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది.
READ MORE:Devara : ముందు నుంచీ స్లో పాయిజనే అబ్బా!!!
గత నాలుగు రోజులుగా పనికి వెళ్లేందుకు జంకుతున్న బాధితుడు
ఆదాయపు పన్ను శాఖ నోటీసు రాజీవ్ జీవితంలో పెను తుఫాను తెచ్చింది. గత 4 రోజులుగా పనికి వెళ్లడం లేదు. విసుగు చెందిన అతను గయాలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ అధికారులు పాట్నాకు వెళ్లమని తనకు సూచించారు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పన్ను శ్లాబ్లో తక్కువగా ఉన్న ఒక పేద వ్యక్తికి రూ. 2 కోట్లకు పైగా పన్ను నోటీసు పంపబడింది. మరి ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, రాజీవ్కు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!