Viral News: రూ. 10వేల కూలీకి.. రూ.2 కోట్లకు పైగా పన్ను కట్టాలని నోటీసులు
- పది వేల రూపాయల జీతగాడికి రూ. 2కోట్ల పన్ను
- పన్ను కట్టాలని నోటీసులు
- ఏం అర్థకాక సతమతమవుతున్న బీద కూలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్లోని గయా జిల్లాలో ఓ పేద కూలీకి ఆదాయపు పన్ను శాఖ రూ.2 కోట్లకు పైగా పన్ను నోటీసులిచ్చిన ఆశ్చర్యకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. చమురు వ్యాపారి వద్ద నెలకు రూ.10 వేల చొప్పున కూలీగా పనిచేస్తున్న రాజీవ్ కుమార్ వర్మకు రూ.2 కోట్ల 3 వేల 308 పన్ను చెల్లించాలని నోటీసు వచ్చింది. రూ. 67 లక్షల జరిమానా కూడా 2 రోజుల్లో చెల్లించాలని నోటీసులో పేర్కొంది. రాజీవ్ ఎప్పుడూ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదని తేలడంతో విషయం మరింత క్లిష్టంగా మారింది. ఇంత తక్కువ ఆదాయంతో రిటర్నులు దాఖలు చేయడం కూడా తనకు తెలియదని బాధితుడు అంటున్నాడు.
READ MORE: Ra Macha : రా మచ్చా.. రామ్ అచ్చా!
Also Read
- CBSE రీవాల్యుయేషన్లో అద్భుతం.. 500కు 500 మార్కులు సాధించిన 'అవ్ని కేజ్రీవాల్'.!
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
- Viral News: రబ్బర్ను మింగేసిన 4ఏళ్ల బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే..
- Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
రూ.2 కోట్ల నోటీసు ఎందుకు వచ్చాయి?
వాస్తవానికి.. 2015లో రాజీవ్ కార్పొరేషన్ బ్యాంక్లో రూ. 2 లక్షల ఎఫ్డి చేసినట్లు తెలిపాడు. అతనకు అత్యవసరం పడటంతో 2016లో ఈ ఎఫ్డీని బ్రేక్ చేసి నగదు తిరిగి తీసుకున్నాడు. దీని తర్వాత పాత గోదాములో పనిచేయడం ప్రారంభించాడు. అయితే అకస్మాత్తుగా ఆదాయపు పన్ను శాఖ రూ. 2 కోట్ల 3 వేల 308 పన్ను నోటీసు పంపి అతని సమస్యలను పెంచింది. 2015-16లో రాజీవ్ రూ.2 కోట్ల ఎఫ్డీ చేశాడని, ఆ పన్ను ఇంకా చెల్లించలేదని ఆదాయపు పన్ను శాఖ ఆరోపిస్తోంది.
READ MORE:Devara : ముందు నుంచీ స్లో పాయిజనే అబ్బా!!!
గత నాలుగు రోజులుగా పనికి వెళ్లేందుకు జంకుతున్న బాధితుడు
ఆదాయపు పన్ను శాఖ నోటీసు రాజీవ్ జీవితంలో పెను తుఫాను తెచ్చింది. గత 4 రోజులుగా పనికి వెళ్లడం లేదు. విసుగు చెందిన అతను గయాలోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయాన్ని సంప్రదించాడు. అక్కడ అధికారులు పాట్నాకు వెళ్లమని తనకు సూచించారు. ఈ ఉదంతం ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. పన్ను శ్లాబ్లో తక్కువగా ఉన్న ఒక పేద వ్యక్తికి రూ. 2 కోట్లకు పైగా పన్ను నోటీసు పంపబడింది. మరి ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, రాజీవ్కు న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘సీఎం సువేందు బాబును ఆపండి’’.. భారత్కు బంగ్లాదేశ్ ఎంపీ విజ్ఞప్తి.
-
Avantika : గోవాలో ఖుష్బూ కుమార్తె డెస్టినేషన్ వెడ్డింగ్.. చిరు, నాగార్జున ఎంట్రీతో ‘స్టార్’ హంగామా!
-
INDA Vs SLA: మరోసారి ఫామ్ కొనసాగించిన సాయి సుదర్శన్.. 132 పరుగులతో వీరవిహారం..
-
CM Revanth Reddy : తుంగభద్రకు కొత్త ఊపిరి.. 33 గేట్లు ప్రారంభం.!
-
Shehbaz Sharif: ఇరాన్ అధ్యక్షుడి టూర్లో పాక్ ప్రధాని వింత ప్రవర్తన.. నెట్టింట తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!