Tamil Nadu: చితిపై నుంచి ఒక్కసారిగా పైకి లేచిన 65 ఏళ్ల వృద్ధురాలు.. అసలు ఏం జరిగింది?
- తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వింత ఘటన
- అనారోగ్యంతో మృతి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు
- చితిపై ఉంచిన శరీరంలో కదలికలు
- ఒక్కసారిగా లేచి కూర్చున్న వృద్ధురాలు
- భయంతో పరుగులు తీసిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఇంట్లో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం బుధవారం శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఆమె మృతదేహాన్ని చితిపై వేశాక ఆమె శరీరంలో కదలికలు వచ్చాయి. ఇది చూసి అందరూ భయపడ్డారు. అందరూ కొంత దూరం పరిగెత్తారు. అప్పుడు ఆ స్త్రీ లేచి నిలబడింది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. మహిళ సజీవంగా ఉండటంతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
చనిపోయినట్లు భావించిన కుటుంబీకులు..
ఈ ఘటన మనప్పరైలోని మరుంగాపురిలో ఉన్న కరుమలై సురంగంపట్టి గ్రామంలో చోటుచేసుకుంది. పంపైయన్ (72), అతని భార్య చిన్నమ్మాళ్ (65) ఇక్కడ నివసిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా వారి ఇంటి సమీపంలోనే ఉంటున్నారు. అది నవంబర్ 16వ తేదీ. భోజనం చేసిన వెంటనే చిన్నమల్లు ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అది చూసి భర్త పంపయ్య భయపడ్డాడు. ఇతర కుటుంబ సభ్యుల సాయంతో చిన్నమ్మాళ్ ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే దారిలో ఆమె ఆరోగ్యం క్షీణించింది. శరీరంలో కదలికలు కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. పల్స్ చెక్ చేశారు. పల్స్ పనిచేయడం ఆగిపోయిందని గుర్తించారు. దీంతో ఆమె చనిపోయినట్లు కుటుంబీకులు భావించారు. దీంతో ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
Also Read
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
- Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
- Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
- Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
మహిళకు అంత్యక్రియ..
పండితుడిని పిలిచి కర్మకాండలన్నీ పూర్తి చేశాడు. అనంతరం పాడెను అలంకరించారు. ఆ తర్వాత మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించారు. ఈ సమయంలో పలువురు మహిళ బంధువులు, గ్రామస్తులు కూడా ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యులు మహిళ మృతదేహాన్ని చితిపై ఉంచారు. దీంతో మృతదేహం కదులుతున్నట్లు గుర్తించారు. ఇది చూసి అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పుడు ఆ స్త్రీ లేవడంతో పరుగులు తీశారు. ముందుగా చేతులు, కాళ్లు కదిలించిన ఆమె ఒక్కసారిగా పైకి లేచి అందరినీ చూడటం మొదలుపెట్టింది. అందరినీ చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో కుటుంబీకులు జరిగిన విషయాన్ని ఆమెకు తెలియజేశారు.
తాజావార్తలు
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!