తిరుపతి ఉప ఎన్నికల్లో రీ-పోలింగ్ జరపాలి : సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి ఉప ఎన్నిక నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఏయితే ఈ ఉప ఎన్నికలో దొంగ నోట్ల కలకలం రేపింది. దీంతో అధికార పార్టీ పై విపక్షాలు మండిపడుతున్నాయి. YCP ఓటమి భయంతోనే ఇలా చేసిందని ఫైర్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. YCPపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రీ-పోలింగ్ జరపాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏజెంట్లు బెదిరించారని…వలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను బెదిరించిందని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వస్తే మా బతుకులు ఏమవుతాయని 40 శాతం ఓటర్లు భయపడ్డారని..తిరుపతి ఎన్నికల్లో అధికార పార్టీ బరితెగించిందన్నారు. బయట నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారని.. వైసీపీకి ఇంతటి ప్రజాదరణ ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నది బీజేపీనేనని…మేం అడ్డుకున్న తర్వాతే 14 ఏళ్లు అధికారంలో, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకి ధైర్యం వచ్చిందని టిడిపికి చురకలు అంటించారు. రామచంద్రారెడ్డి, రామకృష్ణ రెడ్డి ఇద్దరి పేర్లల్లోనూ రాముడు ఉన్నాడని…రాముడు ఎప్పుడు అబద్దం చెప్పడు.. కానీ వీళ్లద్దరి నోటి వెంబడి అన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. టీడీపీ-బీజేపీ కుమ్మక్కంటూ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Also Read
- Tags
- ap
- bjp
- SOMUVEERRAJU
- Tirupathi
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..