తిరుపతి ఉప ఎన్నికల్లో రీ-పోలింగ్ జరపాలి : సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి ఉప ఎన్నిక నిన్న జరిగిన విషయం తెలిసిందే. ఏయితే ఈ ఉప ఎన్నికలో దొంగ నోట్ల కలకలం రేపింది. దీంతో అధికార పార్టీ పై విపక్షాలు మండిపడుతున్నాయి. YCP ఓటమి భయంతోనే ఇలా చేసిందని ఫైర్ అవుతున్నాయి. అయితే తాజాగా ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు.. YCPపై ఫైర్ అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల్లో రీ-పోలింగ్ జరపాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు డిమాండ్ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏజెంట్లు బెదిరించారని…వలంటీర్ వ్యవస్థ ద్వారా ఓటర్లను బెదిరించిందని ఫైర్ అయ్యారు సోము వీర్రాజు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్ధులకు ఓట్లు వస్తే మా బతుకులు ఏమవుతాయని 40 శాతం ఓటర్లు భయపడ్డారని..తిరుపతి ఎన్నికల్లో అధికార పార్టీ బరితెగించిందన్నారు. బయట నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను రప్పించారని.. వైసీపీకి ఇంతటి ప్రజాదరణ ఉంటే 150 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నది బీజేపీనేనని…మేం అడ్డుకున్న తర్వాతే 14 ఏళ్లు అధికారంలో, పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకి ధైర్యం వచ్చిందని టిడిపికి చురకలు అంటించారు. రామచంద్రారెడ్డి, రామకృష్ణ రెడ్డి ఇద్దరి పేర్లల్లోనూ రాముడు ఉన్నాడని…రాముడు ఎప్పుడు అబద్దం చెప్పడు.. కానీ వీళ్లద్దరి నోటి వెంబడి అన్నీ అబద్దాలేనని పేర్కొన్నారు. టీడీపీ-బీజేపీ కుమ్మక్కంటూ అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
Also Read
- Tags
- ap
- bjp
- SOMUVEERRAJU
- Tirupathi
తాజావార్తలు
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
-
India vs England 2nd ODI: కేఎల్ రాహుల్ ఔట్.. ఇషాన్ కిషన్ ఇన్.. అసలు కారణం చెప్పిన కెప్టెన్ గిల్
-
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!