NRC in Bengal: బెంగాల్లో ఎన్ఆర్సిని అనుమతించం.. ఈద్ సభలో సీఎం మమత ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరసత్వ సవరణ చట్టం గురించి మైనారిటీలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి)కి సంబంధించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఎన్ఆర్సిని అనుమతించరని సీఎం మమత ప్రకటించారు. కొందరు వ్యక్తులు ద్వేషపూరిత రాజకీయాలను అనుసరించడం ద్వారా దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే దేశ విభజనను అనుమతించబోనని స్పష్టం చేశారు.
Also Read:Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ
కోల్ కతాలోని రెడ్ రోడ్లో ఈద్ నమాజ్ కోసం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు ఏకం కావాలని, 2024 లోక్సభ ఎన్నికల్లో మితవాద బిజెపి పార్టీని ఓడించేలా చూడాలని పిలుపునిచ్చారు. కాషాయ శిబిరం దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించిన బెనర్జీ..పశ్చిమ బెంగాల్లో NRC అమలు చేయమని స్పష్టం చేశారు. పొరుగు దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వ హక్కులను కల్పించే జాతీయ పౌర రిజిస్టర్, పౌరసవరణ చట్టం అవసరం లేదన్నారు. ఇప్పటికే ఉన్న పౌరసత్వ రికార్డులు, చట్టాలు సరిపోతాయని తమ పార్టీ విధానమని టీఎంసీ అధినేత్రి తేల్చి చెప్పారు.
Also Read:Vishnu Kumar Raju: మీరు బట్టలు విప్పడం కాదు.. 2024లో ప్రజలే మీ బట్టలు విప్పే పరిస్థితి..!
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
ధనబలం(ఆమె రాజకీయ ప్రత్యర్థులు), రాజకీయ ఉద్దేశ్యంతో జరిగే కేంద్ర ఏజెన్సీల దాడులపై పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను తల వంచను అని మమత స్పష్టం చేశారు. మన దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుస్తుందని, సంఘటితమై విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని వాగ్దానం చేద్దాం అని దీదీ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసి ఎవరికి ఓటు వేయాలో నిర్ధారించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!