NRC in Bengal: బెంగాల్లో ఎన్ఆర్సిని అనుమతించం.. ఈద్ సభలో సీఎం మమత ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరసత్వ సవరణ చట్టం గురించి మైనారిటీలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి)కి సంబంధించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఎన్ఆర్సిని అనుమతించరని సీఎం మమత ప్రకటించారు. కొందరు వ్యక్తులు ద్వేషపూరిత రాజకీయాలను అనుసరించడం ద్వారా దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే దేశ విభజనను అనుమతించబోనని స్పష్టం చేశారు.
Also Read:Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ
కోల్ కతాలోని రెడ్ రోడ్లో ఈద్ నమాజ్ కోసం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు ఏకం కావాలని, 2024 లోక్సభ ఎన్నికల్లో మితవాద బిజెపి పార్టీని ఓడించేలా చూడాలని పిలుపునిచ్చారు. కాషాయ శిబిరం దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించిన బెనర్జీ..పశ్చిమ బెంగాల్లో NRC అమలు చేయమని స్పష్టం చేశారు. పొరుగు దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వ హక్కులను కల్పించే జాతీయ పౌర రిజిస్టర్, పౌరసవరణ చట్టం అవసరం లేదన్నారు. ఇప్పటికే ఉన్న పౌరసత్వ రికార్డులు, చట్టాలు సరిపోతాయని తమ పార్టీ విధానమని టీఎంసీ అధినేత్రి తేల్చి చెప్పారు.
Also Read:Vishnu Kumar Raju: మీరు బట్టలు విప్పడం కాదు.. 2024లో ప్రజలే మీ బట్టలు విప్పే పరిస్థితి..!
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ధనబలం(ఆమె రాజకీయ ప్రత్యర్థులు), రాజకీయ ఉద్దేశ్యంతో జరిగే కేంద్ర ఏజెన్సీల దాడులపై పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను తల వంచను అని మమత స్పష్టం చేశారు. మన దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుస్తుందని, సంఘటితమై విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని వాగ్దానం చేద్దాం అని దీదీ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసి ఎవరికి ఓటు వేయాలో నిర్ధారించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!