NRC in Bengal: బెంగాల్లో ఎన్ఆర్సిని అనుమతించం.. ఈద్ సభలో సీఎం మమత ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పౌరసత్వ సవరణ చట్టం గురించి మైనారిటీలు ఆందోళన చెందుతున్న సంగతి తెలిసిందే. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సి)కి సంబంధించిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో ఎన్ఆర్సిని అనుమతించరని సీఎం మమత ప్రకటించారు. కొందరు వ్యక్తులు ద్వేషపూరిత రాజకీయాలను అనుసరించడం ద్వారా దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే దేశ విభజనను అనుమతించబోనని స్పష్టం చేశారు.
Also Read:Kerala BJP chief: కేరళలో ప్రధాని మోడీ హత్యకు కుట్ర.. బీజేపీకి బెదిరింపు లేఖ
కోల్ కతాలోని రెడ్ రోడ్లో ఈద్ నమాజ్ కోసం జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ప్రజలు ఏకం కావాలని, 2024 లోక్సభ ఎన్నికల్లో మితవాద బిజెపి పార్టీని ఓడించేలా చూడాలని పిలుపునిచ్చారు. కాషాయ శిబిరం దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించిన బెనర్జీ..పశ్చిమ బెంగాల్లో NRC అమలు చేయమని స్పష్టం చేశారు. పొరుగు దేశాలకు చెందిన మైనారిటీలకు పౌరసత్వ హక్కులను కల్పించే జాతీయ పౌర రిజిస్టర్, పౌరసవరణ చట్టం అవసరం లేదన్నారు. ఇప్పటికే ఉన్న పౌరసత్వ రికార్డులు, చట్టాలు సరిపోతాయని తమ పార్టీ విధానమని టీఎంసీ అధినేత్రి తేల్చి చెప్పారు.
Also Read:Vishnu Kumar Raju: మీరు బట్టలు విప్పడం కాదు.. 2024లో ప్రజలే మీ బట్టలు విప్పే పరిస్థితి..!
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
ధనబలం(ఆమె రాజకీయ ప్రత్యర్థులు), రాజకీయ ఉద్దేశ్యంతో జరిగే కేంద్ర ఏజెన్సీల దాడులపై పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. తాను తల వంచను అని మమత స్పష్టం చేశారు. మన దేశంలో ఎవరు అధికారంలోకి వస్తారో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తెలుస్తుందని, సంఘటితమై విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని వాగ్దానం చేద్దాం అని దీదీ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో మనమందరం కలిసి ఎవరికి ఓటు వేయాలో నిర్ధారించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో విఫలమైతే తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..