Badlapur: ‘పాఠశాలలో పనిచేసే తాత నా బట్టలు విప్పి…’ బద్లాపూర్లో లైంగిక వేధింపులకు గురైన బాలికల కథ
- ఇద్దరు బాలికలపై స్కూల్ స్వీపర్ లైంగిక దాడి
- కేసు నమోదు చేసిన పోలీసులు
- బాధితల నిరసనలు
- హింసాత్మకంగా మారుతున్న నిరసనలు
- స్పందించిన ప్రభుత్వం
- విచారణ వేగవంతం చేస్తామని హామీ
మహారాష్ట్ర.. థానే.. బద్లాపూర్లోని పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. “ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత ఆగస్టు 16న బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైందని విచారించగా.. ఆ బాలికలు బాధను కుటుంబీకులకు తెలిపారు. అది విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు తెలిపారు. కానీ పోలీసులు 12 గంటల తర్వాత 9 గంటల ప్రాంతంలో కేసు నమోదు చేశారు. తమ కూతుళ్లకు వైద్యపరీక్షలు చేయించడంతో నిజం బయటకు వచ్చింది.
READ MORE: Manu Bhaker video: డ్యాన్స్తో అదరగొట్టిన ఒలింపిక్ విజేత మను భాకర్
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
పాఠశాలకు చెందిన తాత తన బట్టలు విప్పి తన ప్రైవేట్ భాగాలను తాకినట్లు బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితులు బాలికపై అత్యాచారం కూడా చేశారు. పోలీసులు నిందితుడిని పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు ప్రారంభించారు. మంగళవారం ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీని తర్వాత, ప్రభుత్వం చర్యలు చేపట్టి, ఆ ప్రాంతంలోని మహిళా ఇన్స్పెక్టర్ శుభదా షిటోలేను బదిలీ చేసింది. అంతే కాదు స్కూల్ ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, ఓ మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
READ MORE:CM Chandrababu: ప్రభుత్వ విజన్పై చర్చలు జరిపాం.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీపై సీఎం ట్వీట్
ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ..
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ లో ఇలా రాశారు.. “బాద్లాపూర్ పోలీస్ స్టేషన్కు అనుబంధంగా ఉన్న సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి ఆర్తీ సింగ్ను విచారణకు నియమించింది. అని పేర్కొన్నారు.
READ MORE:Oldest woman in the world: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ.. ఆమె జీవిత రహస్యాలు ఇవే..
ఈ కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించేందుకు ప్రతిపాదనను సిద్ధం చేయాలని అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ థానే పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ముందు బద్లాపూర్ పోలీస్ స్టేషన్లో 11 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పోలీసుల నిర్లక్ష్యంపై మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు.
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?