Badlapur: ‘పాఠశాలలో పనిచేసే తాత నా బట్టలు విప్పి…’ బద్లాపూర్లో లైంగిక వేధింపులకు గురైన బాలికల కథ
- ఇద్దరు బాలికలపై స్కూల్ స్వీపర్ లైంగిక దాడి
- కేసు నమోదు చేసిన పోలీసులు
- బాధితల నిరసనలు
- హింసాత్మకంగా మారుతున్న నిరసనలు
- స్పందించిన ప్రభుత్వం
- విచారణ వేగవంతం చేస్తామని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర.. థానే.. బద్లాపూర్లోని పాఠశాలలో ఇద్దరు బాలికలపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకి సంబంధించి నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. “ఆగస్టు 13వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత ఆగస్టు 16న బాలికలు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించారు. చాలా భయాందోళనకు గురయ్యారు. ఏమైందని విచారించగా.. ఆ బాలికలు బాధను కుటుంబీకులకు తెలిపారు. అది విని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని బాధిత బాలికల కుటుంబ సభ్యులు ఆగస్టు 16న పోలీసులకు తెలిపారు. కానీ పోలీసులు 12 గంటల తర్వాత 9 గంటల ప్రాంతంలో కేసు నమోదు చేశారు. తమ కూతుళ్లకు వైద్యపరీక్షలు చేయించడంతో నిజం బయటకు వచ్చింది.
READ MORE: Manu Bhaker video: డ్యాన్స్తో అదరగొట్టిన ఒలింపిక్ విజేత మను భాకర్
Also Read
పాఠశాలకు చెందిన తాత తన బట్టలు విప్పి తన ప్రైవేట్ భాగాలను తాకినట్లు బాధిత బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితులు బాలికపై అత్యాచారం కూడా చేశారు. పోలీసులు నిందితుడిని పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, ఈ విషయంలో పాఠశాల యాజమాన్యం, పోలీసుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు ప్రారంభించారు. మంగళవారం ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీని తర్వాత, ప్రభుత్వం చర్యలు చేపట్టి, ఆ ప్రాంతంలోని మహిళా ఇన్స్పెక్టర్ శుభదా షిటోలేను బదిలీ చేసింది. అంతే కాదు స్కూల్ ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, ఓ మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేశారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది.
READ MORE:CM Chandrababu: ప్రభుత్వ విజన్పై చర్చలు జరిపాం.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీపై సీఎం ట్వీట్
ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారణ..
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ లో ఇలా రాశారు.. “బాద్లాపూర్ పోలీస్ స్టేషన్కు అనుబంధంగా ఉన్న సీనియర్ పోలీసు ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసినందుకు వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్పెక్టర్ జనరల్ ర్యాంక్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారిణి ఆర్తీ సింగ్ను విచారణకు నియమించింది. అని పేర్కొన్నారు.
READ MORE:Oldest woman in the world: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ.. ఆమె జీవిత రహస్యాలు ఇవే..
ఈ కేసును ఫాస్ట్ట్రాక్ కోర్టులో విచారించేందుకు ప్రతిపాదనను సిద్ధం చేయాలని అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ థానే పోలీస్ కమిషనర్ను ఆదేశించారు. బాధిత బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి ముందు బద్లాపూర్ పోలీస్ స్టేషన్లో 11 గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. పోలీసుల నిర్లక్ష్యంపై మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ ఆరోపించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు?.. అసలు కారణం చెప్పిన టీమిండియా కోచ్!
-
Ayodhya Donation Theft Case: నిందితులకు షాక్.. వాదిస్తే రూ.5 లక్షల జరిమానా.. బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం
-
AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
-
OG 2: పవన్ కళ్యాణ్ సరసన బుట్టబొమ్మ?.. పూజా హెగ్డేకు భారీ కమ్బ్యాక్ దక్కిందా?
-
Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!