కొత్త లిక్కర్ పాలసీ.. రూ.1200 కోట్లు టార్గెట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. జీఎస్టీ తర్వాత ఖజానాకు అధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. దీంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు, షాపుల వేలం ద్వారా ఈ ఏడాది దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆర్జించాలని తెలంగాణ ఎక్స్జైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. తాజా లెక్కల ప్రకారం ఖజానాకు ఏటా 24 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుండటంతో.. మద్యం అమ్మకాలపై మరింత ఫోకస్ పెడుతోంది తెలంగాణ సర్కార్. అక్టోబర్లో మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియనుండటంతో… ఇప్పటినుంచే కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు ప్లాన్ చేసింది.
రాష్ట్రంలో మొత్తం 200 లిక్కర్ స్టోర్లు.. 2,216కు పైగా లిక్కర్ షాపులు… హైదరాబాద్ అడ్డాగా పదుల సంఖ్యలో పబ్బులు, వందల సంఖ్యలో బార్లు ఉన్నాయి. మందు బాబుల ద్వారా ఏటా.. తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురుస్తుంది. 2019 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు రెండేళ్ల లైసెన్స్ గడువు కోసం షాపులు, బార్లు, లిక్కర్ స్టోర్ల ఓనర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఈ టెండర్ల ద్వారా… రెండేళ్లకు గాను కేవలం లైసెన్స్ కోసమే ఎక్సైజ్ శాఖకు 600 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చింది. అయితే… ఈ అక్టోబర్తో గడువు ముగియనుంది. దీంతో కొత్త టెండర్లు వేయాలని బిడ్డర్లను ఆహ్వానించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.రాష్ట్రం ఏర్పడ్డాక… 80 కొత్త బార్లకు అనుమతిచ్చింది ఎక్సైజ్ శాఖ. అయితే… పలు కారణాల వల్ల లైసెన్స్ పొందిన షాపులు.. నిర్వహణలో లేవని ఎక్సైజ్ శాఖ లెక్కల్లో తేలాయి. వీటి స్థానంలో మరో 200 కొత్త లిక్కర్ స్టోర్లకు అనుమతినివ్వాలని ప్రణాళికలు వేస్తోంది ప్రభుత్వం. మండలాలు, మున్సిపాలిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో లిక్కర్ షాపులకు అనుమతివ్వాలన్నది ఎక్సైజ్ శాఖ ఆలోచనగా తెలుస్తోంది. కొత్తగా రానున్న మద్యం పాలసీలో… వేలం కోసం దరఖాస్తు ఫీజును కూడా పెంచాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. దీని ద్వారా దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు అధికారులు.
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
- Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
2015-17 వేలం సమయంలో దరఖాస్తు ఫీజు 50 వేల రూపాయలుండగా… గత వేలం పాటలో దీని ధరను లక్ష రూపాయలకు పెంచారు. తాజాగా… రానున్న మద్యం పాలసీలో వేలంలో పాల్గొనే వారి దగ్గర నుంచి 3 లక్షల రూపాయలను ఫీజుగా వసూలు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 4 స్లాబుల్లో లైసెన్స్ ఫీజులున్నాయి. 45 లక్షలు… 50 లక్షలు… 80 లక్షలు… కోటి 20 లక్షల రూపాయల స్లాబులుగా నిర్ణయించింది ప్రభుత్వం. లైసెన్స్ల ధరలను పెంచే యోచనతో కొన్ని ఏరియాల్లో 5 శాతం నుంచి 8 శాతం వరకు పెంచే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!