భారతీయులే టార్గెట్: కిడ్నాపులకు తెగబడ్డ తాలిబన్లు.. రంగంలోకి భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఫ్ఘన్లో అమెరికా బలగాల ఉపసంహరణతో ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమై పరిపాలనను చేతిలోకి తీసుకున్నారు. తాలిబన్ల పాలనను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్థానికులు పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు. తాలిబన్లు మాత్రం నిరసనకారులను అణిచివేస్తున్నారు. కాల్పులకు సైతం పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు పాలనను తమ చేతిలోకి తీసుకున్న తాలిబన్లు షరియా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ చట్టాలు, హింసకు భయపడి అప్ఘన్లు దేశం నుంచి పారిపోయేందుకు సిద్ధమవుతున్నారు. సరిహద్దుల్లో వేలాది మంది అఫ్ఘన్లు పక్కదేశాల ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా సరిహద్దుల్లో వేలాది మంది అఫ్ఘన్లు పడిగాపులు పడుతుండటం హృదయవిదారకంగా మారింది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో తాలిబన్లు కిడ్నాపుల అంకానికి తెరలేపడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
Also Read
- Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
- PM Modi: ఇటలీలో మోడీకి అత్యున్నత గౌరవం.. అగ్రికోలా మెడల్తో సత్కారం
- Modi-Meloni: హైలెట్గా ఇటలీ టూర్.. మోడీ-మెలోని ఫొటోలు వైరల్
- Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో బాధిత కుటుంబానికి కోర్టు షాక్.. నెక్ట్స్ ఏంటి?
తాలిబన్ల పాలనకు వ్యతిరేకంగా నిరసన చేపట్టే వారిపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులు జరుపడం అక్కడ కామన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుతో వారి పంథాను మార్చినట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం కిడ్నాపులకు పాల్పడుతూ కలకలం రేపుతున్నారు. తాజాగా ఓ భారతీయ సిక్ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారిని తాలిబన్లు తుపాకులతో బెదిరించి కిడ్నాప్ చేశారు. ఈ కిడ్నాప్ విషయాన్ని ఇండియన్ వరల్డ్ ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ చంధోక్ ధృవీకరించారు. ఆయనను విడిపించడంలో భారత్ జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ఖతర్ ప్రభుత్వం సహాయం కోరనున్నట్లు తెలుస్తోంది.
కిడ్నాప్ కు గురైన వ్యక్తి పేరు బన్ శ్రీలాల్(50) అని తెలుస్తోంది. ఢిల్లీలోని ఫరీదాబాద్ కు చెందిన ఆయన చాలా ఏళ్ల కిందట కాబుల్లో స్థిరపడ్డారు. అక్కడే ఆయన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ గా పని చేస్తున్నాడు. ఓ ఫార్మాసూటికల్స్ షాప్ ను నిర్వహిస్తున్నాడు. తాలిబన్లు ఇంటింటా కార్డన్ సెర్చ్ చేస్తున్న సమయంలో బన్ శ్రీలాల్ వద్ద భారతీయ పాస్ పోర్టు లభించింది. దీంతో ఆయనను తుపాకులతో బెదిరించి టయోటా కారులో గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనపై స్థానిక సిక్ సామాజిక వర్గ ప్రతినిధులు కాబుల్ డిస్ట్రిక్ట్-11 అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకున్నారే తప్ప దర్యాప్తును సాగించట్లేదు. దీంతో ఆయనను విడిపించేందుకు భారత్ జోక్యం చేసుకోవాలని వారంతా కోరుతున్నారు. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో తాము సంప్రదింపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. భారతీయులను కిడ్నాపు చేయడంతో తాలిబన్లు ఏదైనా వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తున్నారా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తాలిబన్లకు వ్యతిరేకంగా పలుచోట్ల అఫ్ఘన్లు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఏదిఏమైనా అఫ్ఘన్లో పరిస్థితులు మాత్రం రోజురోజుకు భయాంకరంగా మారుతుండటంతో ఆందోనకరంగా మారింది.
- Tags
- afg
- Afghanistan
- india
- Indians
- Taliban
తాజావార్తలు
-
NTR : ఎన్టీఆర్ ‘బాల రామాయణం’ కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
-
Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడిలో ఎన్ఐఏ సంచలన ఛార్జిషీట్.. ఆ ఇద్దరి గైడ్స్ ఎంత పని చేశారంటే..!
-
Congress: డీఎంకే వల్ల కాలేదు, 59 ఏళ్ల కాంగ్రెస్ కోరిక తీర్చిన విజయ్..
-
Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
-
Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!