టీమిండియా టీ20 కెప్టెన్: కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నియామకం కరెక్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీంఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గత కొంతకాలంగా ఎక్కువగా విన్పిస్తుంది. రోహిత్ కే ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాలి? అనే అంశంపై స్టాటిస్టిక్స్ తో సహా అభిమానులు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా ఓడిన ప్రతిసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తోంది. సీనియర్లు సైతం రోహిత్ కు పగ్గాలు అప్పగించాలని మద్దతు పలుకుతున్నారు. ఈక్రమంలోనే త్వరలో జరిగే టీ-20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ విషయంలో అనుహ్య మార్పులు జరుగుతాయనే టాక్ బీసీసీఐ వర్గాల్లో విన్పిస్తుంది.
టీ20 ప్రపంచకప్ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈక్రమంలోనే టీమ్ సెలెక్షన్ను పకడ్బందీగా ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పించి మరీ మెంటర్గా నియమించుకుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఇద్దరు కెప్టెన్సీల విధానాన్ని తీసుకువచ్చేందుకు బీసీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. టెస్టుల్లో కెప్టెన్గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. వన్డే సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని భావిస్తుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సమావేశాల్లో సమాలోచనలు జరిగినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది.
Also Read
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
- Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ఈవెంట్లో రోహిత్ శర్మ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సారథిగా అతడు ముంబైకి ఐదుసార్లు టైటిల్స్ తెచ్చిపెట్టాడు. మరోవైపు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే అతడు ఒక్కసారి కూడా ఆ జట్టుకు టైటిల్ తేలకపోయాడు. దీంతో కోహ్లీ కంటే రోహిత్ కెప్టెన్ గా బెటరనే చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కోహ్లీ కీలక నాకౌట్ మ్యాచ్ల్లో తడబడుతున్నాడు. సారథిగానే కాకుండా బ్యాట్స్ మెన్ గా విఫలం అవుతున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ భారం పడుతుందనే అభిప్రాయం వ్యకం అవుతోంది.
కోహ్లీ సారథ్యంలో టీంఇండియా ఓడినప్పుడల్లా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుండటంతో దీనిపై బీసీసీఐ సైతం దృష్టిసారించింది. ఈక్రమంలోనే బీసీసీఐ సైతం ఇద్దరు కెప్టెన్సీ విధానాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈలో జరగనున్న టీ 20 తర్వాత ఈ మార్పు ఉంటుందని సమాచారం అందుతోంది. దీంతో టెస్టుల్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నారని తెలుస్తోంది. మొత్తానికి బీసీసీఐ తీసుకోనున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?