టీమిండియా టీ20 కెప్టెన్: కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నియామకం కరెక్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీంఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గత కొంతకాలంగా ఎక్కువగా విన్పిస్తుంది. రోహిత్ కే ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాలి? అనే అంశంపై స్టాటిస్టిక్స్ తో సహా అభిమానులు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా ఓడిన ప్రతిసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తోంది. సీనియర్లు సైతం రోహిత్ కు పగ్గాలు అప్పగించాలని మద్దతు పలుకుతున్నారు. ఈక్రమంలోనే త్వరలో జరిగే టీ-20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ విషయంలో అనుహ్య మార్పులు జరుగుతాయనే టాక్ బీసీసీఐ వర్గాల్లో విన్పిస్తుంది.
టీ20 ప్రపంచకప్ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈక్రమంలోనే టీమ్ సెలెక్షన్ను పకడ్బందీగా ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పించి మరీ మెంటర్గా నియమించుకుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఇద్దరు కెప్టెన్సీల విధానాన్ని తీసుకువచ్చేందుకు బీసీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. టెస్టుల్లో కెప్టెన్గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. వన్డే సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని భావిస్తుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సమావేశాల్లో సమాలోచనలు జరిగినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది.
Also Read
- Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
- Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ఈవెంట్లో రోహిత్ శర్మ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సారథిగా అతడు ముంబైకి ఐదుసార్లు టైటిల్స్ తెచ్చిపెట్టాడు. మరోవైపు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే అతడు ఒక్కసారి కూడా ఆ జట్టుకు టైటిల్ తేలకపోయాడు. దీంతో కోహ్లీ కంటే రోహిత్ కెప్టెన్ గా బెటరనే చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కోహ్లీ కీలక నాకౌట్ మ్యాచ్ల్లో తడబడుతున్నాడు. సారథిగానే కాకుండా బ్యాట్స్ మెన్ గా విఫలం అవుతున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ భారం పడుతుందనే అభిప్రాయం వ్యకం అవుతోంది.
కోహ్లీ సారథ్యంలో టీంఇండియా ఓడినప్పుడల్లా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుండటంతో దీనిపై బీసీసీఐ సైతం దృష్టిసారించింది. ఈక్రమంలోనే బీసీసీఐ సైతం ఇద్దరు కెప్టెన్సీ విధానాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈలో జరగనున్న టీ 20 తర్వాత ఈ మార్పు ఉంటుందని సమాచారం అందుతోంది. దీంతో టెస్టుల్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నారని తెలుస్తోంది. మొత్తానికి బీసీసీఐ తీసుకోనున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!