టీమిండియా టీ20 కెప్టెన్: కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ నియామకం కరెక్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీంఇండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను కెప్టెన్ గా చేయాలనే డిమాండ్ అభిమానుల నుంచి గత కొంతకాలంగా ఎక్కువగా విన్పిస్తుంది. రోహిత్ కే ఎందుకు కెప్టెన్సీ ఇవ్వాలి? అనే అంశంపై స్టాటిస్టిక్స్ తో సహా అభిమానులు సోషల్ మీడియాలో వివరిస్తున్నారు. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీం ఇండియా ఓడిన ప్రతిసారి ఈ డిమాండ్ తెరపైకి వస్తోంది. సీనియర్లు సైతం రోహిత్ కు పగ్గాలు అప్పగించాలని మద్దతు పలుకుతున్నారు. ఈక్రమంలోనే త్వరలో జరిగే టీ-20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీ విషయంలో అనుహ్య మార్పులు జరుగుతాయనే టాక్ బీసీసీఐ వర్గాల్లో విన్పిస్తుంది.
టీ20 ప్రపంచకప్ను బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈక్రమంలోనే టీమ్ సెలెక్షన్ను పకడ్బందీగా ఉండేలా చూసుకుంది. అంతేకాకుండా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఒప్పించి మరీ మెంటర్గా నియమించుకుంది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఇద్దరు కెప్టెన్సీల విధానాన్ని తీసుకువచ్చేందుకు బీసీసీఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. టెస్టుల్లో కెప్టెన్గా విరాట్ కోహ్లీని కొనసాగించి.. వన్డే సారథ్య బాధ్యతలను రోహిత్ శర్మకు ఇవ్వాలని భావిస్తుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సమావేశాల్లో సమాలోచనలు జరిగినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ రానుంది.
Also Read
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- Ketan Agarwal Case: ‘పురుషులకు రక్షణ లేదు’.. జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలన్న ఎంపీ మిట్టల్
- PM Modi: ఆస్ట్రేలియా టూర్ ముందు మోడీకి బెదిరింపులు.. ఫేస్బుక్ ఐడీ ఎక్కడదంటే..!
- Om Birla: ప్రజాప్రతినిధులు స్వామి వివేకానంద ఆదర్శాలను ఆచరించాలి
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ ఈవెంట్లో రోహిత్ శర్మ ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సారథిగా అతడు ముంబైకి ఐదుసార్లు టైటిల్స్ తెచ్చిపెట్టాడు. మరోవైపు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అయితే అతడు ఒక్కసారి కూడా ఆ జట్టుకు టైటిల్ తేలకపోయాడు. దీంతో కోహ్లీ కంటే రోహిత్ కెప్టెన్ గా బెటరనే చర్చ తెరపైకి వచ్చింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన కోహ్లీ కీలక నాకౌట్ మ్యాచ్ల్లో తడబడుతున్నాడు. సారథిగానే కాకుండా బ్యాట్స్ మెన్ గా విఫలం అవుతున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ భారం పడుతుందనే అభిప్రాయం వ్యకం అవుతోంది.
కోహ్లీ సారథ్యంలో టీంఇండియా ఓడినప్పుడల్లా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వస్తుండటంతో దీనిపై బీసీసీఐ సైతం దృష్టిసారించింది. ఈక్రమంలోనే బీసీసీఐ సైతం ఇద్దరు కెప్టెన్సీ విధానాన్ని త్వరలో తీసుకొచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈలో జరగనున్న టీ 20 తర్వాత ఈ మార్పు ఉంటుందని సమాచారం అందుతోంది. దీంతో టెస్టుల్లో కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్ గా కొనసాగనున్నారని తెలుస్తోంది. మొత్తానికి బీసీసీఐ తీసుకోనున్న ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే..!
తాజావార్తలు
-
Snapchat Love Story: స్నాప్చాట్ లవ్.. కశ్మీర్ పిల్లను పెళ్లాడేందుకు LoC దాటిన పాక్ కుర్రాడు.. చివరికి ఏమైందంటే?
-
Varanasi: బర్త్డేకు ‘వారణాసి’ ట్రీట్ ఉంటుందా?.. రాజమౌళి నిర్ణయంపై ఫ్యాన్స్ వెయిటింగ్
-
India LNG supply: ఎల్ఎన్జీ సరఫరాపై ఆంక్షలను ఎత్తివేసిన కేంద్రం.. పరిశ్రమలకు భారీ ఊరట
-
Ather, Ola, TVS: ఏథర్, ఓలా, టీవీఎస్.. టచ్స్క్రీన్లతో కూడిన అత్యంత చౌకైన 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ధర ఎంతంటే?
-
Donald Trump: ఖమేనీ అంత్యక్రియల సీన్ చూసి ట్రంప్ మైండ్ బ్లాక్.. అసలు నిజం ఒప్పుకున్న అమెరికా బాస్!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!