ఎల్బీనగర్ను ఇండియా పాక్ సరిహద్దుల్లా మార్చారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి, నిరుద్యోగ సైరన్కు పిలుపునిచ్చింది. దిల్షుఖ్ నగర్కు చేరుకొని అక్కడి నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ చేయాలి అన్నది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అయితే, దిల్షుఖ్ నగర్- ఎల్బీనగర్ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక పేదోళ్లు విద్యకు దూరం అయ్యారని, కులవృత్తులకు పరిమితం కావాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలనే సైరన్కు పిలుపునిచ్చామని, ఎల్బీనగర్ ను ఇండియా, పాకిస్థాన్ సరిహద్దులా మార్చారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గృహనిర్భంధంతో తమను అడ్డుకోవాలని అనుకుంటున్నారని, తెలంగాణ మేధావులు, ఉద్యోగులు ఆలోచన చేయాలని అన్నారు. ఉస్మానియా యూనివర్శిటీ ఉద్యమ స్పూర్తి ఎక్కడకు పోయిందని అన్నారు. అమర వీరుల ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని, భారీ పోలీసుల బలగాలు పెట్టి ప్రభుత్వం ఎవరిమీద దాడి చేయాలని చూస్తోందని ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరించిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారని, ప్రభుత్వాన్ని ఇచ్చిన నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగులకు ఆగ్రహం వస్తే ప్రభుత్వం కాలి బూడిద అవుతుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Read: 75 శాతం మంది ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు… ఈటల
Also Read
- Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
- StepX Neo: ప్రపంచంలోనే తొలి ఐఏ స్టార్మ్ఫోన్ వచ్చేసింది.. చిటికెలో అన్ని పనులు ఫినిష్!
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
తాజావార్తలు
-
RC 17 : దసరాకి రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభం!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
Murder Case: భార్యను కసితీరా చంపాడు.. 620కి.మీ ప్రయాణించి నాగపామును పట్టుకొచ్చి.. చివరికి..!
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్ఫ్లిక్స్తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
ట్రెండింగ్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!