T20 Emerging Asia Cup 2024: ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు..
- ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు
- 7 పరుగుల తేడాతో ఇండియా విజయం
- 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసిన భారత్
- 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసిన పాకిస్తాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. భారత్ బ్యాటింగ్లో తిలక్ వర్మ (44) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత.. అభిషేక్ శర్మ (35), ప్రభ్సిమ్రన్సింగ్ (36), నేహాల్ వధేరా (25), రమన్ దీప్ సింగ్ (17) పరుగులు చేయడంతో.. భారత్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీం 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. మహమ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, అర్ఫత్ మిన్హాస్, ఖాసీం అక్రం తలో వికెట్ సంపాదించారు.
Read Also: Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Kirti Chakra: అమరవీరుడు సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్కు ‘కీర్తి చక్ర’ ప్రదానం.. రాష్ట్రపతి దగ్గర వెక్కి వెక్కి ఏడ్చిన తల్లి
ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో.. భారత్ ఏ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో అత్యధికంగా అర్ఫత్ మిన్హాస్ (41) పరుగులు చేశాడు. ఆ తర్వాత యాసిర్ ఖాన్ (33), ఖాసీం అక్రం (27), అబ్దుల్ సమద్ (25), అబ్బాస్ అఫ్రిదీ (18) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అనుషుల్ కాంబోజ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రసీఖ్ సలాం, నిశాంత్ సింధు తలో 2 వికెట్లు పడగొట్టారు.
Read Also: Group -1 Mains : గ్రూప్-1 పరీక్షలపై మంత్రుల కీలక సమావేశం
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!