T20 Emerging Asia Cup 2024: ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు..
- ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు
- 7 పరుగుల తేడాతో ఇండియా విజయం
- 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసిన భారత్
- 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసిన పాకిస్తాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. భారత్ బ్యాటింగ్లో తిలక్ వర్మ (44) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత.. అభిషేక్ శర్మ (35), ప్రభ్సిమ్రన్సింగ్ (36), నేహాల్ వధేరా (25), రమన్ దీప్ సింగ్ (17) పరుగులు చేయడంతో.. భారత్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీం 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. మహమ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, అర్ఫత్ మిన్హాస్, ఖాసీం అక్రం తలో వికెట్ సంపాదించారు.
Read Also: Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?
Also Read
ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో.. భారత్ ఏ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో అత్యధికంగా అర్ఫత్ మిన్హాస్ (41) పరుగులు చేశాడు. ఆ తర్వాత యాసిర్ ఖాన్ (33), ఖాసీం అక్రం (27), అబ్దుల్ సమద్ (25), అబ్బాస్ అఫ్రిదీ (18) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అనుషుల్ కాంబోజ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రసీఖ్ సలాం, నిశాంత్ సింధు తలో 2 వికెట్లు పడగొట్టారు.
Read Also: Group -1 Mains : గ్రూప్-1 పరీక్షలపై మంత్రుల కీలక సమావేశం
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!