T20 Emerging Asia Cup 2024: ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు..
- ఉత్కంఠపోరులో పాకిస్తాన్ పై భారత్ గెలుపు
- 7 పరుగుల తేడాతో ఇండియా విజయం
- 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసిన భారత్
- 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసిన పాకిస్తాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భాగంగా.. భారత్- ‘ఎ’ జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్-‘ఎ’తో తలపడింది. ఒమన్లోని అల్ అమరత్ నగరంలో అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందు టాస్ గెలిచిన భారత యువ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టీ20 నయా ఓపెనర్ అభిషేక్ శర్మ, వికెట్ కీపర్ ప్రభ్సిమ్రన్సింగ్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించారు. వీరిద్దరూ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. భారత్ బ్యాటింగ్లో తిలక్ వర్మ (44) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత.. అభిషేక్ శర్మ (35), ప్రభ్సిమ్రన్సింగ్ (36), నేహాల్ వధేరా (25), రమన్ దీప్ సింగ్ (17) పరుగులు చేయడంతో.. భారత్ 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. పాకిస్తాన్ బౌలర్లలో సుఫియన్ ముఖీం 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. మహమ్మద్ ఇమ్రాన్, జమాన్ ఖాన్, అర్ఫత్ మిన్హాస్, ఖాసీం అక్రం తలో వికెట్ సంపాదించారు.
Read Also: Off The Record : జీవో 29 కాంగ్రెస్ కు ఇబ్బంది అవుతుందా ? రాహుల్ గాంధీ రంగంలోకి దిగుతారా ?
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో.. భారత్ ఏ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ బ్యాటర్లలో అత్యధికంగా అర్ఫత్ మిన్హాస్ (41) పరుగులు చేశాడు. ఆ తర్వాత యాసిర్ ఖాన్ (33), ఖాసీం అక్రం (27), అబ్దుల్ సమద్ (25), అబ్బాస్ అఫ్రిదీ (18) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అనుషుల్ కాంబోజ్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రసీఖ్ సలాం, నిశాంత్ సింధు తలో 2 వికెట్లు పడగొట్టారు.
Read Also: Group -1 Mains : గ్రూప్-1 పరీక్షలపై మంత్రుల కీలక సమావేశం
తాజావార్తలు
-
Explainer: రెస్టారెంట్ కిచెన్లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!