భారత్లో మరో కొత్త వేరియంట్… హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతున్నాయని సంతోషించే సమయంలో కేంద్రం మరో బాంబు పేల్చింది. ధక్షిణాఫ్రికాలో బి.1.1.529 అనే కొత్త వేరియంట్ను గుర్తించారని, కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతూ కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. అన్ని రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడంచెల పద్దతిలో స్క్రీనింగ్ చేయాలని కేంద్రం ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే వారిపట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
Read: అధికమొత్తంలో బొగ్గును కొనుగోలు చేస్తున్న ఆఫ్ఘన్లు… ఎందుకంటే…
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం కొత్త వేరియంట్ పట్ల హైఅలర్ట్ ప్రకటించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా మాటను మర్చిపోయి ప్రజలు ఇప్పుడిప్పుడే సాధారణ జీవనం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కొత్త వేరియంట్పై అలర్ట్ రావడంతో ప్రజల్లో అయోమయం, భయం నెలకొన్నది. భారత్లో డెల్టా వేరియంట్ ఎలాంటి భీభత్సం సృష్టించిందో చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి.
డెల్టా వేరియంటలో 8 మ్యూటేషన్లు జరిగితే, కొత్తగా దక్షిణాఫ్రికాలో బయటపడిన బి.1.1.529 వేరియంట్లో 32కి పైగా మ్యూటేషన్లు జరిగినట్టు వైరాలజిస్టులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఈ వేరియంట్ను గుర్తించిన వైరాలజిస్ట్ టులియో డే ఒలివెరా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్ ఇప్పుడు బోట్స్వానా, హాంకాంగ్లో కూడా బయటపడినట్టు తెలిపారు. ఈ నెల మొదట్లో రోజూ 106 కేసులు నమోదవుతుండగా, ఈ వేరియంట్ను గుర్తించిన తరువాత దక్షిణాఫ్రికాలో రోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయని వైరాలజిస్టులు తెలిపారు. కాగా, దక్షిణాఫ్రికా, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం హెచ్చరించింది.
తాజావార్తలు
-
Hyderabad: ఏఎంబీ ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం.. ఇద్దరి ప్రాణాలు తీసిన రాంగ్ రూట్ ప్రయాణం..
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!