Mallikarjun Kharge: మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలన్న ప్రతిపక్షాల డిమాండ్పై దృష్టి మళ్లించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలపై నడుచుకోవడం లేదని, పార్లమెంటులో అంతరాయాలకు కారణమైందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. పార్లమెంట్ హౌస్ నుండి విజయ్ చౌక్ వరకు తిరంగా మార్చ్ తర్వాత కాన్స్టిట్యూషన్ క్లబ్లో విపక్ష నేతల సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
Also Read:AP CM Jagan: స్కామ్లు తప్ప.. స్కీమ్లు తెలియవు.. ప్రతిపక్షాలపై సీఎం జగన్ ఫైర్
Also Read
పార్లమెంట్ లో బడ్జెట్పై చర్చ నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యం గురించి ప్రభుత్వం చాలా మాట్లాడుతుందని, కానీ అది చెప్పినదానిని పాటించడం లేదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కోసం ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే అన్నారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ను కేవలం 12 నిమిషాల్లో ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ప్రతిపక్షాలు మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. దేశ సంపదను కాపాడేందుకు విపక్షాలన్నీ ఐక్యంగా పోరాడుతున్నాయని ఖర్గే తెలిపారు.
Also Read:India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
18 నుండి 19 ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన అంశాలు అదానీ విషయంపై ఉన్నాయని అన్నారు. కేవలం 2 నుండి 2.5 సంవత్సరాల కాలంలో అతని సంపద 12 లక్షల కోట్లకు ఎలా పెరిగిందని ఆయన అన్నారు. బీజేపీకి మెజారిటీ సభ్యులు ఉన్నందున జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. అదానీ సమస్యపై జెపిసి విచారణకు ఆదేశించడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు అని ఖర్గే అన్నారు. అదానీ అంశంపై పార్లమెంటులో ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, యూకేలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా దృష్టిని మళ్లించిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!