India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి. ఇక్కడ హైలెట్ విషయం ఏంటంటే ప్రస్తుతం భారత్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది రష్యా నుంచి వచ్చిన ఆయిల్ నే. అంటే రష్యా ఆయిల్ వయా భారత్ అన్నమాట.
2022-23 ఆర్థిక సంవత్సరంలో యూరప్ దేశాలకు డిజీల్, జెట్ ఇంధన ఎగుమతులు ఇండియా నుంచి పెరిగాయి. ఓ రిపోర్టు ప్రకారం భారతదేశం జనవరిలో రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురును కొనుగోలు చేసింది. గతేడాదితో పోలిస్తే రష్యా నుంచి 33 రెట్లు అధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది భారత్. సాంప్రదాయ ఆయిల్ ఎగుమతిదారులైన ఇరాక్, సౌదీ అరేబియాలను వెనక్కి నెట్టేసి రష్యా మొదటిస్థానానికి చేరుకుంది.
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
Read Also: Donald Trump: అరెస్ట్ తర్వాత అమాంతం పెరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ…
రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ను భారత రిఫైనరీల్లో శుద్ధి చేసి ఐరోపాకు డిజీల్, జెట్ ఇంధనాల ఎగుమతి చేస్తోందని షిఫ్ ట్రాకింగ్ డేటా కెప్లర్, వర్టెక్సా వంటి సంస్థలు డేటా చూపిస్తోందని రాయిటర్స్ నివేదించింది. దీంతో భారత రిఫైనరీలకు లాభాలు పెరిగాయి. భారత్ నుంచి ప్రధానంగా ఫ్రాన్స్, టర్కీ, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలకు డీజిల్ ఎగుమతి అవుతోంది. యూరప్ రోజుకు 154,000 నుండి 200,000 బారెల్స్ వరకు డిజల్, జెట్ ఇంధనాన్ని ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
2022-23లో భారత రిఫైనరీలు రోజుకు 970,000-981,000 బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంది. రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ రోస్ నెఫ్ట్, భారతీయ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య ఇటీవల ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ డిజిల్ ఎగుమతులు 12-16 శాతం పెరిగి రోజుకు 150,000-167,000 బ్యారెళ్లకు చేరుకుంది. ఇది మొత్తం భారతదేశ గ్యాసోయిల్ ఎగుమతుల్లో 30 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది 21-24 శాతం ఉండేది. ఇదే కాకుండా భారత్ అమెరికాకు వాక్యూమ్ గ్యాస్ ఆయిల్ ఎగుమతిని కూడా పెంచినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!