India Oil Exports: రష్యా ఆయిల్తో భారత్ వ్యాపారం.. యూరప్కు పెరిగిన ఎగుమతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి. ఇక్కడ హైలెట్ విషయం ఏంటంటే ప్రస్తుతం భారత్, యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నది రష్యా నుంచి వచ్చిన ఆయిల్ నే. అంటే రష్యా ఆయిల్ వయా భారత్ అన్నమాట.
2022-23 ఆర్థిక సంవత్సరంలో యూరప్ దేశాలకు డిజీల్, జెట్ ఇంధన ఎగుమతులు ఇండియా నుంచి పెరిగాయి. ఓ రిపోర్టు ప్రకారం భారతదేశం జనవరిలో రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురును కొనుగోలు చేసింది. గతేడాదితో పోలిస్తే రష్యా నుంచి 33 రెట్లు అధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది భారత్. సాంప్రదాయ ఆయిల్ ఎగుమతిదారులైన ఇరాక్, సౌదీ అరేబియాలను వెనక్కి నెట్టేసి రష్యా మొదటిస్థానానికి చేరుకుంది.
Also Read
- Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
- Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
- Himalayan Glacier: కెమెరాలో చిక్కిన గ్లేసియర్ కూలిన భయానక దృశ్యాలు.. నేపాల్లో భారీ వరదకు ఇదే కారణమా? (వీడియో)
- Milk Price Hike: పండుగ సీజన్కు ముందు మిల్క్ షాక్.. పాల ధర లీటరుకు రూ.102
Read Also: Donald Trump: అరెస్ట్ తర్వాత అమాంతం పెరిగిన డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ…
రష్యా నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ ను భారత రిఫైనరీల్లో శుద్ధి చేసి ఐరోపాకు డిజీల్, జెట్ ఇంధనాల ఎగుమతి చేస్తోందని షిఫ్ ట్రాకింగ్ డేటా కెప్లర్, వర్టెక్సా వంటి సంస్థలు డేటా చూపిస్తోందని రాయిటర్స్ నివేదించింది. దీంతో భారత రిఫైనరీలకు లాభాలు పెరిగాయి. భారత్ నుంచి ప్రధానంగా ఫ్రాన్స్, టర్కీ, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలకు డీజిల్ ఎగుమతి అవుతోంది. యూరప్ రోజుకు 154,000 నుండి 200,000 బారెల్స్ వరకు డిజల్, జెట్ ఇంధనాన్ని ఇండియా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
2022-23లో భారత రిఫైనరీలు రోజుకు 970,000-981,000 బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకుంది. రష్యాలో అతిపెద్ద ఆయిల్ కంపెనీ రోస్ నెఫ్ట్, భారతీయ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మధ్య ఇటీవల ఒప్పందం కూడా కుదిరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ డిజిల్ ఎగుమతులు 12-16 శాతం పెరిగి రోజుకు 150,000-167,000 బ్యారెళ్లకు చేరుకుంది. ఇది మొత్తం భారతదేశ గ్యాసోయిల్ ఎగుమతుల్లో 30 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది 21-24 శాతం ఉండేది. ఇదే కాకుండా భారత్ అమెరికాకు వాక్యూమ్ గ్యాస్ ఆయిల్ ఎగుమతిని కూడా పెంచినట్లు నివేదికలు తెలుపుతున్నాయి.
తాజావార్తలు
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
-
Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
ట్రెండింగ్
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!