అభినయంలో జగజ్జెట్టి… మమ్ముట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి)
మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి చూస్తే తక్కువగా అనిపించవచ్చు. కానీ, సదరు చిత్రాల్లోని కథాంశం, దానిని నడిపించిన తీరు ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంటూ ఉంటాయి. దక్షిణాదిన కమల్ హాసన్ తరువాత మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా నిలచిన ఘనుడు మమ్ముట్టి. తెలుగువారికీ సుపరిచితుడైన మమ్ముట్టి నేటికీ తనదైన బాణీ పలికిస్తూనే ఉన్నారు.
Also Read
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Petrol-Diesel: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. జూలై 1 నుంచి ఆంక్షలు ఎత్తివేత
- Mumbai: ఒడ్డుకు కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. రెస్క్యూ ఆపరేషన్ ఫెయిల్.. చివరికిలా..!
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి పనపరంబిల్ ఇస్మాయిల్. 1951 సెప్టెంబర్ 7న మమ్ముట్టి జన్మించారు. కొట్టాయం జిల్లా వైకోమ్ సమీపంలోని చెంపూలో పెరిగారు. ఆయన తండ్రి ఇస్మాయిల్ హోల్ సేల్ గార్మెంట్స్ షాప్ తో పాటు బియ్యం వ్యాపారం చేసేవారు. ఆరు మంది సంతానంలో మమ్ముట్టి పెద్దవాడు. ఆయనకు ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. లా డిగ్రీ పుచ్చుకున్న మమ్ముట్టి రెండేళ్ళు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. అంతకు ముందు కె.ఎస్. సేతుమాధవన్ రూపొందించిన ‘అనుభవంగళ్ పాలిచకల్’ చిత్రం ద్వారా తెరపై తొలిసారి కనిపించారు మమ్ముట్టి. 1971 నుంచి పలు చిత్రాలలో మమ్ముట్టి నటించారు. 1980లో ‘మేలా’ చిత్రం నటునిగా మమ్ముట్టికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టింది. “ఒరు వాడక్కన్ వీరగాథ, విధేయన్, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్” చిత్రాల ద్వారా జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమనటునిగా నిలిచారు మమ్ముట్టి. తెలుగులో కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘స్వాతికిరణం’లో తొలిసారి నటించారు మమ్ముట్టి. ఈ సినిమా తరువాత సి.ఉమామహేశ్వరరావు రూపొందించిన ‘సూర్యపుత్రులు’లోనూ అభినయించారు. మమ్ముట్టి హీరోగా ‘రైల్వే కూలీ’ అనే చిత్రం తెలుగులో రూపొందింది. కానీ, అది థియేటర్లలో విడుదలకు నోచుకోలేదు. 2019లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితగాథ స్ఫూర్తితో తెరకెక్కిన ‘యాత్ర’లోనూ మమ్ముట్టి నటించారు. దక్షిణాది భాషల్లోనే కాదు హిందీలోనూ మమ్ముట్టి కొన్ని చిత్రాలలో నటించి అలరించారు.
తన స్వరాష్ట్రం కేరళలో కేన్సర్ రోగుల కోసం కోళీకోడ్ లో ఓ కేంద్రాన్ని నెలకొల్పారు మమ్ముట్టి. రాష్ట్రవ్యాప్తంగా కేన్సర్ రోగులకు ఈ కేంద్రం ఎంతగానో సేవలు అందిస్తోంది. తన చుట్టూ ఉన్నవారికి చేతనైన సాయం చేయడానికి మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. మమ్ముటికి ఇద్దరు పిల్లలు. కూతురు పెద్దది. ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ తండ్రిలాగే నటనలో రాణిస్తున్నాడు. ‘మహానటి’లో నాయిక భర్తగా దుల్కర్ నటించాడు. తనయుడు హీరోగా రాణిస్తున్నా, ఏడు పదుల వయసులోనూ మమ్ముట్టి తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయడానికి సిద్ధంగానే ఉండడం విశేషం.
తాజావార్తలు
-
Kapoor Family : టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న కపూర్ కూతురు.. ఇక్కడైనా హిట్ వస్తుందో లేదో
-
Vaibhav-BCCI: అప్పుడు నీతులు చెప్పిన బీసీసీఐ.. ఇప్పుడు ఎందుకు పాటించడం లేదు!
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!