Jail Term: శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా నాలుగేళ్లపాటు జైల్లోనే. అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jail Term: సహజంగా ఖైదీలు శిక్షా కాలం ముగియటం కన్నా ముందే జైలు నుంచి బయటికి రావాలని కోరుకుంటారు. సత్ప్రవర్తన కింద విడుదల చేయాలని జైలు అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు. ఆ అప్లికేషన్ ఆమోదం పొందితే రిలీజ్ అవుతారు. ఇలాంటివి రోజూ జరుగుతూనే ఉంటాయి. కానీ ఓ ఖైదీ తన శిక్షా కాలం ముగిసిన తర్వాత కూడా దాదాపు నాలుగేళ్ల పాటు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. మామాలుగైతే శిక్షా కాలం ముగిసిన ఖైదీలను జైలు అధికారులు వెంటనే విడుదల చేస్తుంటారు. కానీ ఇతని విషయంలో అలా జరగలేదు.
జైలు సూపరింటెండెంట్కి, సెషన్స్ జడ్జికి లాయర్ ప్రత్యేకంగా లెటర్ రాశాక గానీ అతణ్ని విడిచిపెట్టలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎందుకిలా జరిగిందో ఎవరికీ అర్థంకావట్లేదు. పూర్వాపరాలను తెలుసుకునేందుకు హైకోర్టు జడ్జి సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. మానవ హక్కుల పరంగా అతనికి జరిగిన నష్టానికి 3 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. బాధితుడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి ఈ మేరకు తీర్పు ఇచ్చారు. తనకు నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితుడు చేసిన డిమాండ్లో వంద శాతం న్యాయం ఉందని చెప్పారు.
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి పేరు జస్టిస్ ఎస్ఏ ‘ధర్మాధికారి’ కావటం గమనించాల్సిన విషయం. తప్పు రాష్ట్ర ప్రభుత్వానిది కాదని ఆయన అన్నారు. ఖైదీ విడుదల ఉత్తర్వులను జారీ చేయాల్సిన బాధ్యత ‘ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిదే’ అని స్పష్టం చేశారు. ఈ మొత్తం తతంగంలో అసలు ఏం జరిగిందో దర్యాప్తు చేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ‘రిజిస్ట్రార్-విజిలెన్స్’ని ఆదేశించారు. ఈ వ్యవహారం మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. చింద్వారా జిల్లాకు చెందిన ఇందర్సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు ఓ హత్య కేసులో 2005 మార్చి 14న జీవిత ఖైదు విధించింది.
అయితే ఆ తీర్పును హైకోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షగా మార్చింది. ఈ మేరకు జైలు సూపరింటెండెంట్కి, చింద్వారా జిల్లా ‘ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి’కి ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇందర్సింగ్ 2009 సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. కానీ 2012 జూన్ 25 దాక రిలీజ్ కాలేదు. అంటే.. 3 ఏళ్ల 11 నెలల 5 రోజులు అదనంగా శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దీనిపై అతను హైకోర్టును ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. దీనిపై జడ్జి స్పందిస్తూ ఈ వ్యవహారంలో తప్పుచేసినవారిపై తప్పకుండా చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
Iran Missile Attack: అమెరికా-ఇరాన్ యుద్ధం మరింత ఉధృతం.. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
-
FIFA WC 2026: 39 ఏళ్ల మెస్సీని ఇప్పటికీ ఎందుకు ఎవరూ ఆపలేకపోతున్నారు? కారణం ఇదే!
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!