Crime: బీజేపీ నాయకుడి భార్య దారుణ హత్య.. గొడ్డలితో నరికి చంపిన దుండగుడు
- మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాలో దారుణ హత్య
- లోకల్ బీజేపీ నాయకుడి భార్య హత్య
- గొడ్డలితో దారుణంగా హత్య చేసిన దుండగుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని విదిష జిల్లాలో దారుణ హత్య జరిగింది. లోకల్ బీజేపీ నాయకుడు, మాజీ సర్పంచ్ రామ్ విలాస్ ఠాకూర్ భార్య రాణి ఠాకూర్ను గుర్తు తెలియని దుండగుడు గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. జిల్లాలోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెట్పురా గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
Read Also: Bihar Robbery: రూ.25 కోట్ల బంగారు ఆభరణాలు చోరీ.. పోలీసులు కాల్పులు
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భర్త రాంవిలాస్ ఠాకూర్ ఉదయం పొలం వద్దకు వెళ్ళాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య రక్తం మడుగులో పడి ఉందని తెలిపాడు. ఈ ఘటనపై భర్త పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో.. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఏఎస్పీ చౌబే మాట్లాడుతూ.. సంఘటన జరిగిన సమయంలో 22 ఏళ్ల కుమార్తె కూడా ఇంట్లోనే ఉందని తెలిపారు. ఈ ఘటనకు కేవలం 10 నిమిషాల ముందు ఆమె స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. ఈ సమయంలో రాణి ఠాకూర్ పై దాడి చేసి చంపాడని పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలం నుండి ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Trivikram: త్రివిక్రమ్’కి హీరో దొరికాడోచ్?
కాగా.. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు నిమగ్నమయ్యారు. పట్టపగలే ఈ ఘోరం జరగడంతో ఆ ప్రాంతంలో భయాందోళన వాతావరణం నెలకొంది. డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణుల బృందం సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. హంతకుడిని త్వరలో అరెస్టు చేస్తామని.. ఈ హత్య వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!