Jawahar Nagar: జంట హత్యకేసులో ప్రేమికులు అరెస్ట్
- జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు
- మిస్టరీను ఛేదించిన పోలీసులు
- తన అక్క, తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్న ప్రేయసి లక్ష్మి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jawahar Nagar: హైదరాబాద్లోని జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రియుడుతో కలిసి అమానుష చర్య:
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
బీహార్కు చెందిన అరవింద్ కుమార్తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన అక్క జ్ఞానేశ్వరి దగ్గర చెప్పగా, ఆమె తీవ్రంగా మందలించిందని పోలీసులు తెలిపారు. దీంతో లక్ష్మి ప్రియుడితో కలిసి తన అక్కను హత్య చేసి, మృతదేహాన్ని మూటగట్టిపట్టి సంపులో పడేసింది.
Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఢిల్లీ!
తల్లిని కూడా హత్య:
అక్క కనిపించకుండా పోవడంతో లక్ష్మిని నిలదీసింది ఆమె తల్లి సుశీల. ఆ తర్వాత తల్లికి కూడా తన ప్రేమ వివాహం గురించి చెప్పింది లక్ష్మి. అయితే, అరవింద్తో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తల్లి మందలించడంతో ఆమెను కూడా హత్య చేసింది.
నాటకీయంగా దోపిడీగా మలిచిన లక్ష్మి:
తల్లిని హత్య చేసిన అనంతరం లక్ష్మి, అరవింద్ కలిసి ఆమె వద్ద ఉన్న నగలు దోచుకున్నారు. అనంతరం ఈ ఘటనను దోపిడీ దొంగలు చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ, లక్ష్మి కదలికలు అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
Read Also: Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో
పోలీసుల విచారణ:
పోలీసుల విచారణలో లక్ష్మి తన అక్క, తల్లిని ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే హత్య చేసిందని ఒప్పుకుంది. ఈ ఘటనలో ఆమెతో పాటు అరవింద్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జవహర్ నగర్లో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలతో తల్లి, అక్కను హత్య చేయడం అందరిని నివ్వెరపరిచేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!