Jawahar Nagar: హైదరాబాద్లోని జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రియుడుతో కలిసి అమానుష చర్య:
బీహార్కు చెందిన అరవింద్ కుమార్తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన అక్క జ్ఞానేశ్వరి దగ్గర చెప్పగా, ఆమె తీవ్రంగా మందలించిందని పోలీసులు తెలిపారు. దీంతో లక్ష్మి ప్రియుడితో కలిసి తన అక్కను హత్య చేసి, మృతదేహాన్ని మూటగట్టిపట్టి సంపులో పడేసింది.
Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఢిల్లీ!
తల్లిని కూడా హత్య:
అక్క కనిపించకుండా పోవడంతో లక్ష్మిని నిలదీసింది ఆమె తల్లి సుశీల. ఆ తర్వాత తల్లికి కూడా తన ప్రేమ వివాహం గురించి చెప్పింది లక్ష్మి. అయితే, అరవింద్తో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తల్లి మందలించడంతో ఆమెను కూడా హత్య చేసింది.
నాటకీయంగా దోపిడీగా మలిచిన లక్ష్మి:
తల్లిని హత్య చేసిన అనంతరం లక్ష్మి, అరవింద్ కలిసి ఆమె వద్ద ఉన్న నగలు దోచుకున్నారు. అనంతరం ఈ ఘటనను దోపిడీ దొంగలు చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ, లక్ష్మి కదలికలు అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
Read Also: Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో
పోలీసుల విచారణ:
పోలీసుల విచారణలో లక్ష్మి తన అక్క, తల్లిని ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే హత్య చేసిందని ఒప్పుకుంది. ఈ ఘటనలో ఆమెతో పాటు అరవింద్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జవహర్ నగర్లో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలతో తల్లి, అక్కను హత్య చేయడం అందరిని నివ్వెరపరిచేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.