Jawahar Nagar: జంట హత్యకేసులో ప్రేమికులు అరెస్ట్
- జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు
- మిస్టరీను ఛేదించిన పోలీసులు
- తన అక్క, తల్లిని హత్య చేసినట్లు ఒప్పుకున్న ప్రేయసి లక్ష్మి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jawahar Nagar: హైదరాబాద్లోని జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ప్రియుడుతో కలిసి అమానుష చర్య:
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
బీహార్కు చెందిన అరవింద్ కుమార్తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె తన అక్క జ్ఞానేశ్వరి దగ్గర చెప్పగా, ఆమె తీవ్రంగా మందలించిందని పోలీసులు తెలిపారు. దీంతో లక్ష్మి ప్రియుడితో కలిసి తన అక్కను హత్య చేసి, మృతదేహాన్ని మూటగట్టిపట్టి సంపులో పడేసింది.
Read Also: WPL 2025 Final: బెంగళూరు చేతిలో ముంబై ఓటమి.. డబ్ల్యూపీఎల్ ఫైనల్కు ఢిల్లీ!
తల్లిని కూడా హత్య:
అక్క కనిపించకుండా పోవడంతో లక్ష్మిని నిలదీసింది ఆమె తల్లి సుశీల. ఆ తర్వాత తల్లికి కూడా తన ప్రేమ వివాహం గురించి చెప్పింది లక్ష్మి. అయితే, అరవింద్తో పెళ్లి చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ తల్లి మందలించడంతో ఆమెను కూడా హత్య చేసింది.
నాటకీయంగా దోపిడీగా మలిచిన లక్ష్మి:
తల్లిని హత్య చేసిన అనంతరం లక్ష్మి, అరవింద్ కలిసి ఆమె వద్ద ఉన్న నగలు దోచుకున్నారు. అనంతరం ఈ ఘటనను దోపిడీ దొంగలు చేసినట్లు నమ్మించేందుకు ప్రయత్నించారు. కానీ, లక్ష్మి కదలికలు అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు.
Read Also: Producers : ఇద్దరు నిర్మాతలు పోటాపోటిగా స్టేట్మెంట్స్.. గెలుపెవరిదో
పోలీసుల విచారణ:
పోలీసుల విచారణలో లక్ష్మి తన అక్క, తల్లిని ప్రేమ వివాహానికి అడ్డుగా ఉన్నారనే కారణంతోనే హత్య చేసిందని ఒప్పుకుంది. ఈ ఘటనలో ఆమెతో పాటు అరవింద్ కుమార్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటన జవహర్ నగర్లో తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలతో తల్లి, అక్కను హత్య చేయడం అందరిని నివ్వెరపరిచేలా చేసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించి న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!