నేటి నుంచి రెండో ‘టెస్ట్’… గెలిచిన జట్టుకే సిరీస్
ముంబై వేదికగా నేటి నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ జరగనుంది. ఉదయం 9:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విజయం దాకా వచ్చి డ్రాతో సరిపెట్టుకున్న భారత్.. ఈ టెస్టులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు ఓడిపోయే టెస్టును అద్భుతంగా పోరాడి డ్రా చేసుకోవడంతో న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. టీమిండియా రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ టెస్టులో బరిలోకి దిగనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల అతడు తొలి టెస్ట్ ఆడలేదు.
Read Also: కెప్టెన్ గా కోహ్లీ ముందు అరుదైన రికార్డు
Also Read
అయితే టీమిండియా తుదిజట్టు ఎలా ఉండబోతున్న విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ ఎవరి స్థానంలో జట్టులోకి వస్తాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుజారా లేదా రహానెలలో ఒకరు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా రెండో టెస్టుకు స్పిన్ పిచ్ను తయారు చేసినట్లు తెలుస్తోంది. నిర్ణయాత్మక రెండో టెస్టులో ఫలితం రావాలనే ఉద్దేశంతో స్పిన్ పిచ్ రూపొందించినట్లు సమాచారం. సొంతగడ్డపై భారత జట్టు స్పిన్ను ప్రధాన అస్త్రంగా భావిస్తోన్న నేపథ్యంలో వాంఖడే పిచ్ను దీనికి అనుగుణంగానే తయారు చేస్తున్నామని ముంబై క్రికెట్ సంఘం వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!