Anand Mohan Singh: ఐఏఎస్ అధికారి హత్య కేసులో దోషి.. జైలు నుంచి మాజీ ఎంపీ విడుదల
ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ జైలు నుంచి విడుదలైయ్యారు. బీహార్ గ్యాంగ్స్టర్గా మారిన రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్ 30 ఏళ్ల నాటి హత్య కేసులో జైలు నుంచి విడుదలయ్యారు. నితీష్ కుమార్ ప్రభుత్వం అతని విడుదలను సులభతరం చేయడానికి జైలు నిబంధనలను సవరించింది. బీహార్ జైలు మాన్యువల్ను సవరించిన కొద్ది రోజుల తర్వాత, 27 మంది ఖైదీల విడుదలకు బీహార్ ప్రభుత్వం ఈరోజు నోటిఫై చేసింది. ఇందులో 1994లో జి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ కూడా ఉన్నారు.
Also Read:Land Dispute: భూవివాదం.. కారంపొడి, కొడవళ్లు, గొడ్డళ్లు, కర్రలతో రెండు వర్గాల దాడి
ఆనంద్ మోహన్ తన కుమారుడి నిశ్చితార్థం కోసం మూడోసారి పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. దాదాపు 30 ఏళ్ల నాటి హత్యకేసులో ఆనంద్ మోహన్ జైలు నుంచి విడుదలయ్యాడని ఫంక్షన్ సందర్భంగా సమాచారం అందింది. ఆనంద్ మోహన్ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆయన డిప్యూటీ తేజస్వీ యాదవ్, జేడీయూ చీఫ్ లాలన్ సింగ్ సహా రాజకీయ నేతలు, మంత్రులు హాజరయ్యారు. 1994లో గోపాల్గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి కృష్ణయ్యను కొట్టడానికి ఆనంద్ మోహన్ ఒక గుంపుకు నాయకత్వం వహించాడు. కృష్ణయ్యను ఆ గుంపు హత్య చేసింది. బీహార్లోని దిగువ కోర్టు 2007లో మరణశిక్ష విధించింది. అయితే పాట్నా హైకోర్టు దానిని జీవిత ఖైదుగా మార్చింది; ఆ ఉత్తర్వును 2012లో సుప్రీంకోర్టు సమర్థించింది.
Also Read
ఈ నెల ప్రారంభంలో బీహార్ ప్రభుత్వం విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వోద్యోగిని హత్య చేసినందుకు దోషులకు జైలు శిక్షను తగ్గించడాన్ని నిషేధించిన నిబంధనను తొలగించింది. 14 ఏళ్ల జైలు శిక్ష లేదా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీల కోసం కొత్త నిబంధనలు ఉన్నాయని రాష్ట్ర న్యాయ శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఏప్రిల్ 20న బీహార్ రాష్ట్ర శిక్షాస్మృతి మండలి సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని, అసలు 14 ఏళ్ల జైలు శిక్ష లేదా 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించిన ఖైదీల విడుదల కోసం నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.
Also Read:Ys Sunitha Political Entry Live: వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ?
నిబంధనల మార్పు, ఆనంద్ మోహన్ సింగ్ విడుదల అంశం వివాదంగా మారింది. యూపీ మాజీ సీఎం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నిబంధనల మార్పును దళిత వ్యతిరేకమైనదిగా పేర్కొంది. అత్యంత నిజాయితీపరుడైన ఐఏఎస్ అధికారి జి కృష్ణయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో నిబంధనలను మార్చి ఆనంద్ మోహన్ విడుదలకు నితీష్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆనంద్ మోహన్ సింగ్ విడుదల దళిత సమాజానికి కోపం తెప్పిస్తుందని, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని బీఎస్పీ అధినేత్రి కోరారు.బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ కూడా నితీశ్ కుమార్పై విరుచుకుపడ్డారు. “అధికారం కోసం ఒక క్రిమినల్ సిండికేట్పై మొగ్గు చూపే ఎవరైనా ప్రతిపక్ష నేతగా కూడా భారతదేశానికి ముఖంగా ఉండగలరా?” అని విమర్శించారు.
Also Read:Covid cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు…పెరిగిన మరణాలు
తాజావార్తలు
-
SRH: సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు శుభవార్త.. జట్టులోకి మరో కాటేరమ్మ కొడుకు..
-
Cognizant: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కాగ్నిజెంట్.!
-
Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న ‘పెద్ది’ రిలీజ్..
-
Gutti Vankaya Recipe : కుక్కర్లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!