Prakash Singh Badal: పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ మంగళవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 95 ఏళ్లు.శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో వారం క్రితం మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలను భటిండాలోని బాదల్ గ్రామంలో నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని మొహాలి నుంచి బాదల్ గ్రామానికి తరలించనున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్ పార్థివ దేహాన్ని చండీగఢ్లోని సెక్టార్ 28లోని SAD ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు, అక్కడ ప్రజలు చివరి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత చండీగఢ్ నుంచి బాదల్ గ్రామం వరకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ప్రముఖ రాజకీయ వేత్త అంత్యక్రియలు ఏప్రిల్ 27 (గురువారం)న నిర్వహించనున్నారు. ప్రకాష్ సింగ్ బాదల్కు భార్య సురీందర్ కౌర్ బాదల్, కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, కోడలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఉన్నారు. బాదల్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్ నాయకుడికి నివాళులర్పించారు. బాదల్ భారత రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తి, గొప్ప రాజనీతిజ్ఞుడు అని ట్వీట్ చేశారు.
Also Read:Off The Record: కేసీఆర్ ఊహించని నిర్ణయం..? గజ్వేల్ నుంచి పోటీ చేయట్లేదా..?
ఐదుసార్లు పంజాబ్ ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్ పనిచేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ 1970-71, 1977-80, 2007-2017 మధ్య పంజాబ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పంజాబ్లో సీఎం పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడైన ముఖ్యమంత్రిగా ప్రకాష్ సింగ్ బాదల్ నిలిచారు. పంజాబ్లోని అబుల్ ఖురానా గ్రామంలో డిసెంబర్ 8, 1927న జన్మించిన ప్రకాష్ సింగ్ బాదల్ 1950లలో అకాలీదళ్ పార్టీ సభ్యునిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పంజాబ్ శాసనసభ సభ్యునిగా (MLA) అనేకసార్లు పనిచేశారు. 1970లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.
Also Read:Rain Alert: మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
Also Read
ఏడు దశాబ్దాల పాటు సాగిన రాజకీయ జీవితంలో బాదల కేవలం రెండు ఎన్నికల్లో మాత్రమే ఓడిపోయారు. 1967, 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చూశారు. జూన్ 1984లో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలో మిలిటెంట్లను ఏరివేయడానికి సైన్యం అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్లోకి ప్రవేశించినప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు. 2020లో కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనపై ఆయన పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నిరసన తెలిపిన రైతుల పట్ల వ్యవహరించిన తీరుకు నిరసనగా ప్రకాష్ సింగ్ బాదల్ తన పద్మవిభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చారు. పొరుగున ఉన్న హర్యానాతో నది నీటిని పంచుకోవడానికి ఉద్దేశించిన సట్లెజ్ యమునా లింక్ (SYL) కాలువ ఆలోచనను అకాలీదళ్ నాయకుడు తీవ్రంగా వ్యతిరేకించారు.
Extremely saddened by the passing away of Shri Parkash Singh Badal Ji. He was a colossal figure of Indian politics, and a remarkable statesman who contributed greatly to our nation. He worked tirelessly for the progress of Punjab and anchored the state through critical times. pic.twitter.com/scx2K7KMCq
— Narendra Modi (@narendramodi) April 25, 2023
తాజావార్తలు
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!