బూస్టర్ డోస్..! కోవాగ్జిన్, కోవిషీల్డ్లో ఏది బెటర్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌతాఫ్రికాలో వెలుగు చేసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ క్రమంగా అన్ని దేశాలను చుట్టేస్తోంది.. తాజాగా కరోనా పుట్టినిల్లు చైనాను కూడా తాకింది ఈ కొత్త వేరియంట్.. మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బూస్టర్ డోస్పై చర్చ మొదలైంది.. భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోంది.. ఇప్పటికే 133 కోట్ల మార్క్ను కూడా దాటేసింది వ్యాక్సినేషన్.. దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్దే దీనిలో అగ్రభాగం.. మరి, ఇప్పుడు బూస్టర్ డోస్పై చర్చ సాగుతోన్న తరుణంలో.. కోవాగ్జిన్ బెటరా..? కోవిషీల్డ్ వేసుకుంటేనే మంచిదా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.. అయితే, ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్పై కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెబుతున్నారు వైద్య నిపుణులు.. కాబట్టి టీకాల పనితీరుపై సందేహాలు పక్కనపెట్టి, వెంటనే వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ టీకాలు ఒమిక్రాన్పై కనీసం 50 శాతం మేర సమర్థంగా పనిచేస్తాయని చెబుతున్నారు.
Read Also: ఫ్యాన్స్ రచ్చపై స్పందించిన ఐకాన్ స్టార్.. ఎప్పుడూ మర్చిపోను..!
Also Read
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
- Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
వ్యాక్సినేషన్తో జబ్బు తీవ్రరూపం దాల్చకుండా ఉంటుందని.. ఇప్పటికే రెండు డోసులూ పూర్తయిన వారికి బూస్టర్ డోస్ తప్పనిసరి అని సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు వైద్య నిపుణులు.. కోవిడ్ సోకినవారిలోగాని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలోగాని 6 నెలల తరువాత పరీక్షలు జరిపితే.. యాంటీబాడీస్ గణనీయంగా తగ్గిపోతున్నాయని.. యాంటీబాడీస్ తగ్గిపోతే మళ్లీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని… ఈ సమస్యను అధిగమించాలంటే రెండు డోసులు పూర్తయిన ఆరు నెలల తరువాత, బూస్టర్ డోసు తీసుకోవాలంటున్నారు… అయితే, బూస్టర్ డోస్లో క్రాస్ వ్యాక్సిన్ మంచిదని సూచిస్తున్నారు.. అంటే మొదటి రెండు డోసులు ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకున్నవారు, బూస్టర్ డోస్కు వచ్చేసరికి మరో రకమైన వ్యాక్సిన్ తీసుకోవాలి.. దీంతో శరీరంలో రెండు వేరువేరు యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయని చెబుతున్నారు.. ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకుంటే 900 యాంటీబాడీస్ వస్తాయని.. అదే క్రాస్ వ్యాక్సిన్ అయితే 1800 యాంటీబాడీస్ ఉత్పన్నం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నమాట.. కాగా, భారత ప్రభుత్వం ఇప్పటి వరకు బూస్టర్ డోస్పై ఎలాంటి నిర్ణయానికి రాలేదు.. ఒమిక్రాన్ టెన్షన్ పెడుతోన్న వేళ.. ఆ వైపు అడుగులు వేస్తుందా..? లేదా? అనేది వేచిచూడాల్సిన విషయమే.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!