Chrisann Pereira: క్రిసన్ యు ఆర్ ఫ్రీ… కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఎఇలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు క్రిసన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. అనంతం ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీతో వీడియో కాల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా నటి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిసన్ పెరీరా సోదరుడు కెవిన్ పెరీరా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు క్రిసాన్ తల్లి ఆనందంతో గెంతుతున్నట్లు వీడియోలో ఉంది. క్రిసన్ యు ఆర్ ఫ్రీ అంటూ ఆనంద వ్యక్తం చేసింది. ఆమె వచ్చే 48 గంటల్లో భారత్లో ఉంటుంది అని కెవిన్ చెప్పాడు. ఆమె తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నటుడు కన్నీరుమున్నీరైంది. మీరు స్వేచ్ఛగా ఉన్నారు అని ఆమె తల్లి ప్రమీలా పెరీరా అడిగింది.
Also Read:Covid Cases: కరోనా తగ్గేదే లే.. కొత్తగా ఎన్ని కేసులంటే..
పెరీరాను ఏప్రిల్ 1న షార్జా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కుక్క విషయంలో జరిగిన గొడవ తర్వాత ప్రతీకారంగా బేకరీ యజమాని ఆ నటుడిని ఇరికించారని ముంబై క్రైమ్ బ్రాంచ్ తర్వాత కనుగొంది. బేకరీ యజమాని ఆంథోనీ పాల్, క్రిసాన్ పెరీరాను ఇరిక్కించేందుకు ఆంథోనీకి సహాయం చేసిన బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేష్ బోభాటేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కుక్క విషయంలో ఆంథోనీ సోదరి, నటి క్రిసాన్ తల్లితో గొడవపడిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరూ ఒకే భవనంలో నివసిస్తున్నారు. ఇదే అంశంపై నటి క్రిసన్ పెరీరాని డ్రగ్స్ కేసులో ఇరికించారని పోలీసులు అనుమానిస్తున్నారు. టాలెంట్ కన్సల్టెంట్గా ఉన్న రాజేష్ ద్వారా ఆంథోనీ నటిని సంప్రదించి షార్జాలో వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ గురించి చెప్పాడు. అతను డ్రగ్స్ దాచిన ట్రోఫీని కూడా తీసుకెళ్లమని ఆమెను కోరినట్లు పోలీసులు తెలిపారు. క్రిసన్ పెరీరా పట్టుబడేలా అందులో గంజాయి దాచి ట్రోఫీని ఇచ్చాడు. క్రిసన్ దిగిన తర్వాత, నిందితుడు షార్జా విమానాశ్రయానికి కాల్ చేసి, ఆమె డ్రగ్స్ తీసుకువెళుతున్నట్లు అధికారులకు చెప్పాడని పోలీసులు తెలిపారు.
Also Read:Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
Also Read
డ్రగ్స్తో పట్టుబడిన తర్వాత పెరీరాను విడుదల చేసేందుకు ఆమె కుటుంబం నుండి రూ. 80 లక్షలు డిమాండ్ చేశారు. ఇదే తరహాలో కనీసం ఐదుగురిని ట్రాప్ చేసేందుకు ఆంథోనీ, రాజేష్ కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు సంబంధిత పత్రాలను సంబంధిత అధికారులకు పంపారు. ఆ తర్వాత పెరీరాను బుధవారం రాత్రి విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, క్రిసన్ పెరీరా సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో నటించింది.
తాజావార్తలు
-
Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ
-
Preity Zinta: శ్రేయాస్ అయ్యర్ ఒంటిచేతితో కొట్టిన సిక్సర్.. సొట్టబుగ్గల సుందరి ఫిదా..
-
PBKS vs DC : ధర్మశాలలో ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం.. పంజాబ్పై ఉత్కంఠభరిత గెలుపు.!
-
Off The Record : రేస్ లో వెనకబడ్డారా? పాకా సత్యనారాయణ నిశ్శబ్దంపై రాజకీయ చర్చ
-
Trump: ‘విషమ స్థితిలో ఉన్న రోగిలా ఉంది’.. ఇరాన్ తీరును ఎండగట్టిన ట్రంప్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?