Chrisann Pereira: క్రిసన్ యు ఆర్ ఫ్రీ… కన్నీళ్లు పెట్టుకున్న బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డ్రగ్స్ కేసులో ఇరుక్కుని యుఎఇలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు క్రిసన్ పెరీరా జైలు నుండి విడుదలయ్యారు. అనంతం ఆమె తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. షార్జా జైలు నుండి విడుదలైన తర్వాత తన ఫ్యామిలీతో వీడియో కాల్లో మాట్లాడింది. ఈ సందర్భంగా నటి కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను క్రిసన్ పెరీరా సోదరుడు కెవిన్ పెరీరా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు క్రిసాన్ తల్లి ఆనందంతో గెంతుతున్నట్లు వీడియోలో ఉంది. క్రిసన్ యు ఆర్ ఫ్రీ అంటూ ఆనంద వ్యక్తం చేసింది. ఆమె వచ్చే 48 గంటల్లో భారత్లో ఉంటుంది అని కెవిన్ చెప్పాడు. ఆమె తల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆమెతో మాట్లాడుతున్నప్పుడు నటుడు కన్నీరుమున్నీరైంది. మీరు స్వేచ్ఛగా ఉన్నారు అని ఆమె తల్లి ప్రమీలా పెరీరా అడిగింది.
Also Read:Covid Cases: కరోనా తగ్గేదే లే.. కొత్తగా ఎన్ని కేసులంటే..
పెరీరాను ఏప్రిల్ 1న షార్జా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కుక్క విషయంలో జరిగిన గొడవ తర్వాత ప్రతీకారంగా బేకరీ యజమాని ఆ నటుడిని ఇరికించారని ముంబై క్రైమ్ బ్రాంచ్ తర్వాత కనుగొంది. బేకరీ యజమాని ఆంథోనీ పాల్, క్రిసాన్ పెరీరాను ఇరిక్కించేందుకు ఆంథోనీకి సహాయం చేసిన బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రాజేష్ బోభాటేలను పోలీసులు అరెస్ట్ చేశారు. కుక్క విషయంలో ఆంథోనీ సోదరి, నటి క్రిసాన్ తల్లితో గొడవపడిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇద్దరూ ఒకే భవనంలో నివసిస్తున్నారు. ఇదే అంశంపై నటి క్రిసన్ పెరీరాని డ్రగ్స్ కేసులో ఇరికించారని పోలీసులు అనుమానిస్తున్నారు. టాలెంట్ కన్సల్టెంట్గా ఉన్న రాజేష్ ద్వారా ఆంథోనీ నటిని సంప్రదించి షార్జాలో వెబ్ సిరీస్ కోసం ఆడిషన్ గురించి చెప్పాడు. అతను డ్రగ్స్ దాచిన ట్రోఫీని కూడా తీసుకెళ్లమని ఆమెను కోరినట్లు పోలీసులు తెలిపారు. క్రిసన్ పెరీరా పట్టుబడేలా అందులో గంజాయి దాచి ట్రోఫీని ఇచ్చాడు. క్రిసన్ దిగిన తర్వాత, నిందితుడు షార్జా విమానాశ్రయానికి కాల్ చేసి, ఆమె డ్రగ్స్ తీసుకువెళుతున్నట్లు అధికారులకు చెప్పాడని పోలీసులు తెలిపారు.
Also Read:Drugs Caught: కొకైన్ తరలించేందుకు కొత్త స్కెచ్.. అడ్డంగా బుక్కైన కిలాడి లేడి
Also Read
డ్రగ్స్తో పట్టుబడిన తర్వాత పెరీరాను విడుదల చేసేందుకు ఆమె కుటుంబం నుండి రూ. 80 లక్షలు డిమాండ్ చేశారు. ఇదే తరహాలో కనీసం ఐదుగురిని ట్రాప్ చేసేందుకు ఆంథోనీ, రాజేష్ కుట్ర పన్నారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు సంబంధిత పత్రాలను సంబంధిత అధికారులకు పంపారు. ఆ తర్వాత పెరీరాను బుధవారం రాత్రి విడుదల చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, క్రిసన్ పెరీరా సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో నటించింది.
తాజావార్తలు
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
-
Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
-
Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!