Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు సీరియస్.. సీక్రెట్ ప్లేస్కు మోజ్తాబా!
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు సీరియస్
- సీక్రెట్ ప్లేస్కు మోజ్తాబా!
- అంతర్జాతీయ మీడియాలో కథనాలు
- స్పష్టత ఇవ్వని ఇరాన్ ప్రభుత్వ పెద్దలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియమితులయ్యారు. ఈ ప్రక్రియ జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా.. ఇప్పటి వరకు మోజ్తాబా బహిరంగంగా ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. అమెరికా, ఇజ్రాయెల్తో జోరుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు. దీంతో తాజాగా కొత్త కథనాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో మోజ్తాబా తీవ్రంగా గాయపడినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇరాన్ రాష్ట్ర మీడియా కూడా మోజ్తాబా గాయపడినట్లుగా ధృవీకరించింది. కానీ తాజా ఆరోగ్య పరిస్థితిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీంతో అంతర్జాతీయ మీడియాలో రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోజ్తాబాకు సీరియస్గా ఉందని.. రహస్య ప్రాంతంలో ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వ పెద్దలు కూడా స్పందించలేదు.
Also Read
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
- Trump: “వాళ్లు మన మధ్యే తిరుగుతున్నారు”.. ఏలియన్స్ వెబ్సైట్ ప్రారంభించిన వైట్హౌస్
- Anti-Ageing Plan: అమరత్వం కోసం పుతిన్ భారీ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
మోజ్తాబాకి భద్రత
ఇక మోజ్తాబా ఖమేనీకి భద్రత పెంచేందుకు ప్రత్యేకంగా ఒక ఉగ్రవాద నిరోధక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు అమెరికన్ మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ విభాగం నేషనల్ ఒపరేషన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఒబ్జెక్టివ్స్ అని పిలవబడుతుంది. ఈ విభాగాన్ని ప్రత్యేకంగా ఖమేనీ కుటుంబాన్ని రక్షించడానికి ఏర్పాటు చేసినట్లు ఫాక్స్ న్యూస్ నివేదిక పేర్కొంది. ఈ విభాగం 1991లో స్థాపించబడింది. ప్రస్తుతం మోజ్తాబా ఖమేనీకి భద్రతా సాయం అందిస్తోంది. అయితే మోజ్తాబా ఖమేనీ ఇప్పటివరకు ఎటువంటి వీడియో సందేశాన్ని విడుదల చేయలేదు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారనేది సమాచారం రాలేదు. ఒకవేళ తీవ్రంగా గాయపడితే ప్రస్తుతం ఎలా ఉన్నారన్న వివరాలు కూడా ఇరాన్ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్ అధ్యక్ష భవనంపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఖమేనీ సహా కుటుంబ సభ్యులు హతమయ్యారు. అనంతరం ఖమేనీ కుమారుడు మోజ్తాబాను ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా నియమించారు. కానీ ప్రస్తుతం అతని పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరాన్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..