దేశంలో కరోనా మహమ్మారికి బ్రేక్ పడడం లేదు. గడచిన నెల రోజులుగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా మరణాలు, యాక్టివ్ కేసులు కూడా ఆదే స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో 9,355 కొత్త కరోనా కేసులు వెలుగు చూశాయి. అయితే, యాక్టివ్ కేసులు 57,410 కి తగ్గాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 26 మరణాలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య 5,31,424కి పెరిగింది. ఇందులో కేరళలోనే అత్యధికంగా 10 మంది మరణించారు. ఢిల్లీలో ఆరు, మహారాష్ట్ర, రాజస్థాన్లలో మూడు, హర్యానా, ఉత్తరప్రదేశ్లలో రెండు, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్లలో ఒక్కొక్కటి చొప్పున మరణాలు సంభవించాయి.
Also Read:Sudan Crisis: సూడాన్లో సంక్షోభం… కాల్పుల విరమణ పొడిగింపుకు ప్రాథమిక ఆమోదం
రోజువారీ పాజిటివిటీ రేటు 4.08 శాతంగా నమోదైంది. వారంవారీ సానుకూలత రేటు 5.36 శాతంగా ఉంది. మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4.49 కోట్లకు చేరింది. యాక్టివ్ కేసులు ఇప్పుడు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.13 శాతం ఉన్నాయి. కోవిడ్ రికవరీ రేటు 98.69 శాతంగా నమోదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,43,35,977కి పెరిగింది. కరోనా మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఢిల్లీలో గత 24 గంటల్లో 1,095 తాజా కోవిడ్ -19 కేసులు మరియు ఆరు మరణాలు నమోదయ్యాయి, అయితే పాజిటివ్ రేటు 22.74% నమోదైంది. ఢిల్లీలో వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 26,606కి చేరుకుంది. మొత్తం కేసుల సంఖ్య 20,35,156కి పెరిగింది. కాగా, భారతదేశంలో బుధవారం 9,629 కరోనా కేసులు నమోదయ్యాయి.