Gautam Gambhir: “అది ప్లేయర్స్ ఇష్టం”.. హనుమాన్ ఆలయ వివాదంపై గంభీర్ ఫైర్.. విమర్శకులకు బిగ్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్పు గెలిచిన సంతోషం ఓ వైపు ఉంటే.. మరోవైపు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ట్రోఫీని హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. కేవలం ఒకే మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరానికి వెళ్లడం వివక్షాపూరితమని ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ ఫైర్ అయ్యాడు. ముందుగా టీమ్ విజయానికి విలువ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఇష్యూస్కు ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. 15 మంది టీమ్ ఎంతో కష్టపడి సాధించిన విజయం ఇది. ఈ విక్టరీపై అనవసర ప్రకటనలు చేయడం విజయం విలువను తగ్గిస్తాయి. సౌతాఫ్రికా జట్టుపై ఓడిపోయినప్పుడు ఆటగాళ్లు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారో నాకు తెలుసు. ప్రస్తుతం గెలిచిన ఆనందంలో వాళ్లు ఉన్నారు. ఇలాంటి టైమ్లో ఈ వ్యాఖ్యలు చేయడం మన జట్టును, మన ప్లేయర్స్ను మనమే తక్కువగా చేసుకోవడం అవుతుంది. విక్టరీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లేయర్స్ ఇష్టం. అది వాళ్ల స్వేచ్ఛ. ఇందులో రాజయం, మతపరమైన జోక్యం అనవసరం. ఇది దేశానికి గర్వ కారణమైన సమయం. విమర్శల కంటే విజయాన్ని ఆస్వాధించడం ముఖ్యం.” అని గంభీర్ స్పష్టం చేశారు.
READ MORE: Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు సీరియస్.. సీక్రెట్ ప్లేస్కు మోజ్తాబా!
Also Read
- Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
- Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
- AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించారు. ఈ కప్పులు కెప్టెన్ సూర్యకుమార్ అందుకోగానే హనుమాన్ ఆలయానికి పరుగులు తీశాడు. ఈ విజయం సాధించిన వెంటనే అర్ధరాత్రి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జయ్ షా కలిసి అహ్మదాబాద్లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ కప్ ట్రోఫీతో వెళ్లి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారాయి. ఈ వీడియోపై తాజాగా మాజీ ప్లేయర్ నుంచి విమర్శలు రాగా.. గంభీర్తో పాటు మాజీ ప్లేయర్ భజ్జీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
READ MORE: Flight: విమానంలో మహిళ రచ్చరచ్చ.. కిందకు దించేసిన సిబ్బంది
తాజావార్తలు
-
Trump-Iran: జోర్డాన్లో అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి.. తీవ్ర ప్రతీకారం ఉంటుందని ట్రంప్ హెచ్చరిక
-
Rahul Gandhi: అమిత్ షాను వెంటనే తొలగించండి.. ప్రధానికి రాహుల్ సలహా..
-
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
-
Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
-
Bhagyashri Borse: ‘ఆ విషయం చెబితే మా అమ్మ నన్ను వాట్సాప్లో బ్లాక్ చేసింది.. 6 నెలలు మాట్లాడలేదు’..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!