Gautam Gambhir: “అది ప్లేయర్స్ ఇష్టం”.. హనుమాన్ ఆలయ వివాదంపై గంభీర్ ఫైర్.. విమర్శకులకు బిగ్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: టీ20 వరల్డ్ కప్పు గెలిచిన సంతోషం ఓ వైపు ఉంటే.. మరోవైపు కొత్త వివాదం తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ప్లేయర్, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ట్రోఫీని హనుమాన్ ఆలయానికి తీసుకెళ్లం ఏంటి? అని ప్రశ్నించారు. ఈ అంశంపై తాజాగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించారు. కేవలం ఒకే మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరానికి వెళ్లడం వివక్షాపూరితమని ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై గంభీర్ ఫైర్ అయ్యాడు. ముందుగా టీమ్ విజయానికి విలువ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఇష్యూస్కు ఆన్సర్ చెప్పాల్సిన పని లేదు. 15 మంది టీమ్ ఎంతో కష్టపడి సాధించిన విజయం ఇది. ఈ విక్టరీపై అనవసర ప్రకటనలు చేయడం విజయం విలువను తగ్గిస్తాయి. సౌతాఫ్రికా జట్టుపై ఓడిపోయినప్పుడు ఆటగాళ్లు ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నారో నాకు తెలుసు. ప్రస్తుతం గెలిచిన ఆనందంలో వాళ్లు ఉన్నారు. ఇలాంటి టైమ్లో ఈ వ్యాఖ్యలు చేయడం మన జట్టును, మన ప్లేయర్స్ను మనమే తక్కువగా చేసుకోవడం అవుతుంది. విక్టరీని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్నది ప్లేయర్స్ ఇష్టం. అది వాళ్ల స్వేచ్ఛ. ఇందులో రాజయం, మతపరమైన జోక్యం అనవసరం. ఇది దేశానికి గర్వ కారణమైన సమయం. విమర్శల కంటే విజయాన్ని ఆస్వాధించడం ముఖ్యం.” అని గంభీర్ స్పష్టం చేశారు.
READ MORE: Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్కు సీరియస్.. సీక్రెట్ ప్లేస్కు మోజ్తాబా!
Also Read
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
- Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. అమిత్ షా, సీఆర్ పాటిల్తో కీలక భేటీలు!
ఇదిలా ఉండగా.. ఈ సీజన్లో భారత్ టీ20 వరల్డ్ కప్పు కైవసం చేసుకుంది. ఇప్పటికే భారత్ వద్ద రెండు కప్పులు ఉన్నాయి. ఇది మూడోది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్పు కొట్టిన ఏకైక జట్టు టీమిండియా. భారత జట్టులో నిన్న అందరూ అదరగొట్టారు. బరిలోకి దిగిన బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించారు. ఈ కప్పులు కెప్టెన్ సూర్యకుమార్ అందుకోగానే హనుమాన్ ఆలయానికి పరుగులు తీశాడు. ఈ విజయం సాధించిన వెంటనే అర్ధరాత్రి భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్, అంతర్జాతీయ క్రికెట్ మండలి అధ్యక్షుడు జయ్ షా కలిసి అహ్మదాబాద్లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ప్రపంచ కప్ ట్రోఫీతో వెళ్లి ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారాయి. ఈ వీడియోపై తాజాగా మాజీ ప్లేయర్ నుంచి విమర్శలు రాగా.. గంభీర్తో పాటు మాజీ ప్లేయర్ భజ్జీ సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
READ MORE: Flight: విమానంలో మహిళ రచ్చరచ్చ.. కిందకు దించేసిన సిబ్బంది
తాజావార్తలు
-
Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
-
Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
-
Rajat Patidar-RCB: మేం గెలవడానికి అర్హులం కాదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ షాకింగ్ కామెంట్స్!
-
Prabhas: సప్తగిరి పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట రచ్చ అవుతున్న కామెంట్స్!
-
IPL 2026 Playoffs Scenario: ప్లేఆఫ్స్ రేసు మరింత హీట్.. టాప్లో ఆర్సీబీ.. 8 జట్ల అవకాశాలు ఇలా!
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత