టీడీపీ ‘ఏపీ బంద్’.. రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ల పర్వం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.. టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. పట్టాభి ఇంట్లో విధ్వంసమే సృష్టించారు.. ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయం, ఇతర జిల్లా కార్యాలయాలపై వైసీపీ శ్రేణులకు దాడులకు పాల్పడ్డాయి.. కొన్ని చోట్ల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. ఈ పరిణామాలపై సీరియస్గా రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రబంద్కు పిలుపునిచ్చారు.. అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ సంస్థలు, ప్రజాస్వామ్య హితైభిలాషులు బంద్కు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులపై బలంగా నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయాలపై దాడి చేసి అక్కడ ఉన్నవారిని చంపాలని చూడటం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమమని, రాష్ట్రపతి పాలన విధించడానికి ఈ దారుణం చాలదా అని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు.. ఇక, ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో బంద్కు టీడీపీ నేతలు ప్రయత్నిస్తుండగా.. టీడీపీ నేతలను రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.
మరోవైపు.. తమ ఇంటిపై దాడి చేశారంటూ వైసీపీపై పటమట పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత పట్టాభి భార్య ఫిర్యాదు చేశారు.. తమపై పెట్రోల్ పోశారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో తెలుగు మహిళలు కంప్లైంట్ ఇచ్చారు… ఇక, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వాళ్లల్లో విజయవాడ వైసీపీ నేతలున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. విజయవాడ కార్పొరేషన్కు చెందిన వివిధ కార్పొరేటర్లు స్వయంగా దాడులకు పాల్పడ్డారని మండిపడుతున్నారు.. పలువురు రౌడీ షీటర్లు కూడా దాడులు పాల్పడిన వారిలో ఉన్నారని టీడీపీ అనుమానం వ్యక్తం చేస్తుండగా.. తెర వెనుక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ పాత్ర ఉందని టీడీపీ డౌట్ గా ఉంది.. ఇదే అంశంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే యోచనలో టీడీపీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.
Also Read
- Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
- Tamilnadu: చీలిక దిశగా ఏఐఏడీఎంకే.. ఎమ్మెల్యేల తిరుగుబావుటా తప్పదా! కారణమిదేనా?
- Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
- Bengal: సీఎం సువేందు తొలి కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
తాజావార్తలు
-
Ittehad-ul-Mujahideen: పాక్ను వణికిస్తున్న కొత్త ఉగ్ర ముఠా.. వణికిపోతున్న ఇస్లామాబాద్!
-
Keralam: తమిళనాడు పోయి.. కేరళం వచ్చే.. కేసీ వర్సెస్ సతీశన్ పంచాయితీ తెగేనా?
-
Vijay: పాపం విజయ్… రచ్చ గెలిచి ఇంట గెల్వలేకపోయాడా??
-
Nimmala Ramanaidu : 2027 జూన్ కి పోలవరం ప్రాజెక్టు పూర్తి
-
Sreemukhi : ముచ్చటగా మూడో ఇల్లు కొనేసిన శ్రీముఖి
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?