Bharat Bill Payment System: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ‘భారత్’లోనూ బిల్లులు కట్టొచ్చు
Bharat Bill Payment System: భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్(బీబీపీఎస్)లో ప్రస్తుతం మన దేశంలో ఉండేవాళ్లు మాత్రమే బిల్లులు పే చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆప్షన్ని ఇకపై విదేశాల్లో ఉండే భారతీయులకు (ఎన్ఆర్ఐలకు) కూడా అందుబాటులోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిన్న శుక్రవారం ప్రతిపాదించింది. ఈ మేరకు విధివిధానాలను రూపొందించనున్నారు. గైడ్లైన్స్ వస్తే ఇక ఫారన్లో ఉన్నా భారత్లో బిల్లులు చెల్లించొచ్చు. బీబీపీఎస్ పరిధిలో ప్రస్తుతం 20 వేలకు పైగా బిల్లర్లు నమోదై ఉన్నారు.
కరంట్, వాటర్, టెలిఫోన్, బ్రాడ్ బ్యాండ్, కేబుల్ తదితర బిల్లులు దీని ద్వారా కట్టొచ్చు. వయసు మీదపడ్డ తల్లిదండ్రులు ఇండియాలో ఉండి, పిల్లలు ఇతర దేశాల్లో ఉంటే అలాంటివాళ్లు ఆయా కార్యాలయాలకు వెళ్లి బిల్లులు క్లియర్ చేయటం కష్టమవుతోంది. మన దేశంలో డిజిటల్ పేమెంట్లు పెద్దఎత్తున జరుగుతున్నా విదేశాల్లో ఉన్న ఇండియన్స్ ఈ బిల్లులను పే చేయటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ఈ ప్రపోజల్ తెచ్చింది.
Also Read
- Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
- Stock Market Crash: రెండు గంటల్లోనే రూ.3.7 లక్షల కోట్లు లాస్.. ఇన్వెస్టర్లను ముంచేసిన మంగళవారం!
- Salary Delay: సారీ బాస్.. ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! ఈసారి 'ఫస్ట్'కు శాలరీ రాదు.. ఎందుకో తెలుసా?
- Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
Google Gift to India: ‘భారతమాత’కు గూగుల్ తల్లి జేజేలు. ‘ఇండియా కీ ఉదాన్’ ప్రారంభం
‘ఆర్మీ’కి సుమారు 2 లక్షల కోట్లు
2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు వివిధ సైనిక పరికరాల కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్లు కేటాయించింది. ఈ మూడేళ్లలో 59 ఏఓఎన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటి విలువ రూ.1,83,778 కోట్లు అని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ లోక్సభలో వెల్లడించారు. ఏఓఎన్ అంటే యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్లో మొట్టమొదటి దశ ఇదే. తర్వాత మరో రెండు దశలు ఉంటాయి. అవి.. టెండరింగ్, కాంట్రాక్టింగ్. ఈ మూడు దశలు దాటితేనే రక్షణ సామగ్రి సైన్యం చేతికి చేరుతుంది.
ప్లీజ్ ‘మహింద్రా’
బ్రిటన్లోని వెస్ట్ మిడ్ల్యాండ్స్ ఏరియాలో మోటర్ సైకిల్ ఫ్యాక్టరీ పెట్టాలంటూ మన దేశంలోని మహింద్రా అండ్ మహింద్రా (ఎం అండ్ ఎం) సంస్థపై లాబీయింగ్ జరుగుతోంది. యూకేలో వాహన తయారీ రంగానికి ఈ ప్రాంతం కీలక కేంద్రం. అక్కడ ఒకప్పుడు 400కు పైగా సంస్థలు ఉండేవి. వాటిలో ఏకంగా 10 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు. మన దేశానికి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారీ కేంద్రం కూడా అక్కడ ఉండటం విశేషం. ఆ ప్రాంతానికి పూర్వ వైభవం తేవటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేయర్ ఆండీ స్ట్రీట్ ‘ఎం అండ్ ఎం’కి ఆహ్వానం పలికారు.
తాజావార్తలు
-
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
-
Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
-
Aadhaar Card: మీకు ఇది తెలుసా? మీ ఆధార్ కార్డు మీ పుట్టిన తేదీకి గ్యారెంటీ కాదట! ఎందుకో తెలుసా..
-
Exam Malpractice: పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ 20 మంది వైద్య విద్యార్థులు..
-
BJP: గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్, ఆప్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో