Sushila Meena: కేంద్ర మంత్రిని క్లీన్ బౌల్డ్ చేసిన లేడీ జహీర్ ఖాన్.. వీడియో వైరల్.
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.
- కేంద్రమంత్రిని క్లీన్ బౌల్డ్ చేసిన సుశీలా మీనా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sushila Meena: టీమిండియా బౌలర్లు లో ఒక్కరైనా జహీర్ ఖాన్ లాగా బౌలింగ్ చేసే యువ క్రికెటర్ సుశీలా మీనా పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి నోటా మారుమోగుతోంది. ఈమె టాలెంట్ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుని, దేశవ్యాప్తంగా సుశీలా గురించి చర్చ మొదలైంది. సుశీలా మీనా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన పేద కుటుంబంలో జన్మించింది. ఆమె చిన్నప్పటినుంచి క్రికెట్ పై విపరీతమైన ఆసక్తి చూపించింది. క్రికెట్ ఆడటానికి తగిన సౌకర్యాలు లేకున్నా, తన ప్రతిభను ప్రతి అవకాశంలో నిరూపించుకుంటూ వచ్చింది.
Also Read: Maha kumbh mela: ముస్లింలతో మాకు శత్రుత్వం లేదు.. అయినా, కుంభమేళాలో షాపులు మాత్రం పెట్టుకోనివ్వం..
Also Read
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
సుశీలా మీనాలోని ప్రతిభను చూసిన సచిన్ టెండూల్కర్ ఆమె బౌలింగ్ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఈ వీడియోలో ఆమె బౌలింగ్ శైలీని శివంగి వంటి ఆకట్టుకునే విధంగా ఉండటంతో, సచిన్ తన మనసును చూరగొంది. ఈ వీడియో వైరల్ కావడంతో సుశీల గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్ ఇటీవల రాజస్థాన్ పర్యటన సందర్భంగా సుశీలా మీనాతో సరదాగా క్రికెట్ ఆడారు. ఆ సందర్భంగా సుశీల వేసిన బంతిని ఆడడానికి ప్రయత్నించగా రాజవర్ధన్ సింగ్ రాథోడ్ క్లీన్ బోల్డ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సమ్బన్ధినచ్చిన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Ram Charan Fans: మృత్యువాత పడ్డ అభిమానుల ఇంటికి చరణ్ ఫ్యాన్స్
రాజస్థాన్ బాలిక సుశీల మీనా.. అచ్చం జహీర్ ఖాన్ మాదిరిగా బౌలింగ్ వేస్తూ అదరగొడుతోంది. గతంలో ఈమె టాలెంట్ ను సచిన్ బయటపెట్టాడు. తాజాగా ఈ బాలిక బౌలింగ్లో కేంద్రమంత్రి రాజ్య వర్ధన్ సింగ్ రాథోడ్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.#SusheelaMeena#rajyavardhanSinghRathore#SachinTendulkar pic.twitter.com/cPhvIWINQV
— Anabothula Bhaskar (@AnabothulaB) January 8, 2025
సుశీల ప్రతిభను గుర్తించిన రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ ఆమెకు ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. శిక్షణకు సంబంధించిన ఖర్చును కూడా అసోసియేషన్ భరిస్తోంది. మాజీ క్రికెటర్లు సుశీలా భవిష్యత్తుపై చాలా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. సుశీలా ఒక మట్టిలో పుట్టిన మాణిక్యం. సరైన శిక్షణ అందిస్తే ఆమె భారత మహిళా క్రికెట్ జట్టుకు భవిష్యత్ నాయకురాలిగా మారే అవకాశం ఉంది. ఆమె బౌలింగ్ శైలి చూస్తే దేశానికి గర్వించదగిన ఆటగాళ్లలో ఒకరిగా మారుతుందనే నమ్మకం ఉందని అంటున్నారు. సుశీలా మీనా తన ప్రతిభతోనే కాదు, తపనతో కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది. ఈ ప్రయాణంలో సచిన్ టెండూల్కర్, రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ వంటి ప్రముఖుల ప్రోత్సాహం ఆమెను మరింత ఎత్తుకు తీసుకెళ్తుందని సందేహమే లేదు.
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?