IND VS AUS: ఆలౌట్ అయిన ఆసీస్.. భారత్ టార్గెట్ ఎంతంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెన్నై వేదికగా జరుగుతున్న మూడో వన్డేలలో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. 49 ఓవర్లకు 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి 3వ వన్డేలో భారత్కు 270 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 49 ఓవర్లకు 269 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ 33, మిచెల్ మార్ష్ 47 రన్స్ చేశారు. ఇక, కెప్టెన్ స్టీవ్ స్మిత్ డకౌటయ్యాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్దీప్ పాండ్య చెరో మూడు వికెట్లను పడగొట్టారు. అక్షర్ పటేల్, సిరాజ్ తలో రెండు వికెట్లు తీశారు.
Also Read:Green Corridor: జాతీయ రహదారులపై హెచ్ఎండిఏ పూలబాటలు
చెన్నైలోని చెపాక్కంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీని తర్వాత ఆస్ట్రేలియా జట్టు ఓపెనింగ్ ప్లేయర్లుగా ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ రంగంలోకి దిగారు. జట్టు స్కోరు 68 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ 33 పరుగుల వద్ద ఔటయ్యాడు. 1 సిక్స్, 8 ఫోర్లతో 47 పరుగులు జోడించిన మిచెల్ మార్ష్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఔటయ్యాడు. తదుపరి కెప్టెన్ స్టీవ్ స్మిత్ పరుగులేమీ చేయకపోగా, డేవిడ్ వార్నర్ 23 పరుగులు, మార్నస్ లాబుషాగ్నే 28 పరుగులు చేశారు.
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- Tamil Nadu: పొట్టి దుస్తుల వైరల్ వీడియోపై మహిళ ఆవేదన.. బాధ్యతగా ఉండాలని విజ్ఞప్తి
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
Also Read:CM KCR Tour: రేపు కరీంనగర్ జిల్లాకు సీఎం కేసీఆర్.. రైతులకు సాయం ప్రకటిస్తారా?
కాసేపటికి బ్యాటింగ్కు దిగిన వికెట్ కీపర్ అలెక్స్ కారీ 38 పరుగులు జోడించాడు. దూకుడుగా పరుగులు తీయడంలో పేరుగాంచిన మార్కస్ స్టోయినిస్ 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత వచ్చిన సీన్ అబాట్ 26 పరుగులు, అష్టన్ అగర్ 17 పరుగులు చేశారు. మిచెల్ స్టార్క్, ఆడమ్ చంపా 10 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత 270 పరుగులు చేస్తే గెలుపే లక్ష్యంగా భారత జట్టు రంగంలోకి దిగింది. ఇప్పటికే జరిగిన 2 వన్డేల్లో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్లో గెలిచి టైగా నిలిచాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!