కుప్పంలో వైసీపీ సాధించింది ఓ గెలుపేనా?: అచ్చెన్నాయుడు
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ సాధించిన గెలుపుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి అధికార పార్టీ కుప్పంలో ఏం చేసిందో ప్రజలందరూ చూశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కుప్పంలో గెలిచామని సీఎం, మంత్రులు జబ్బలు చరుచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారని… అది కూడా ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలిచి సిగ్గు, శరం లేకుండా సంబరాలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమాయకులైన మహిళలను పుంగనూరు, ఇతర నియోజకవర్గాల నుంచి దొంగ ఓట్లు వేయడానికి తరలించారని.. చేతకాని ఎన్నికల సంఘం కూడా టీడీపీ ఓటమికి కారణమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు, మంత్రుల నిర్వాకంతో మహిళలు ముఖాలకు చీరచెంగులు అడ్డంపెట్టుకుని సిగ్గుతో తలదించుకున్నారన్నారు. కుప్పంలో వైసీపీ గెలుపును ప్రజలు అసలు లెక్కేసుకోవడం లేదన్నారు. నిజంగా ప్రజలు వైసీపీతోనే ఉంటే ప్రభుత్వం తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే పార్టీని మూసివేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బేతంచర్లలో టీడీపీకి నాయకుడే లేకపోయినా.. ఆరు స్థానాలు గెలిచామని అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సొంత వార్డులో వైసీపీ ఓడిపోయిందని… దానిపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రజల సమస్యలపై చర్చించడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి ధైర్యం లేదని.. ఒక్కరోజు అసెంబ్లీ పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. 12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగితే.. 7 మున్సిపాలిటీల్లో కార్యకర్తలు హోరాహోరీగా పోరాడారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 7 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి 30 శాతం ఓట్లు వచ్చాయని ముఖ్యమంత్రే చెప్పారని.. మరిప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 46శాతం ఓట్లు పొంది తన ప్రాభవాన్ని పెంచుకుందన్నారు. వైసీపీకి, టీడీపీకి పడిన ఓట్లను సరిపోల్చి చూస్తే అధికారపార్టీకి 49 శాతం ఓట్లువస్తే, టీడీపీకి 45 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
5, 6 జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేసిందనేది వాస్తవమన్నారు. గుంటూరు పట్టణంలో 6 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 1280 ఓట్లతో గెలిస్తే, ఇప్పుడు అదేస్థానంలో జరిగిన ఎన్నికలో టీడీపీ అభ్యర్థి 680 ఓట్లతో గెలిచారన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలు గుంటూరు డివిజన్లో పని చేయలేదా అంటూ నిలదీశారు. దాచేపల్లిలో వైసీపీ 11వార్డుల్లో గెలిస్తే, టీడీపీ 9 స్థానాల్లో గెలిచిందన్నారు. టీడీపీ గెలిచిన చోట్ల ఇప్పటికీ చేయాల్సిన దారుణాలు చేస్తూనే ఉన్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!