అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. పేరుకుపోయిన కోవిడ్ టీకాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సమయంలో ఎన్నో భయాలు.. వ్యాక్సిన్ వేసుకుంటే ఏదో అయిపోతుందనే అనుమానాలు.. ఇక, ఆ తర్వాత క్రమంగా వ్యాక్సిన్వైపు పరుగులు పెట్టారు జనం.. కానీ, అప్పుడు వ్యాక్సిన్లు దొరకని పరిస్థితి.. గంటల తరబడి లైన్లలో వేచిచూడాల్సిన దుస్థితి.. ఆ తర్వాత నో స్టాక్ బోర్డులు పెట్టి.. వ్యాక్సిన్ హాలిడే ప్రకటించిన సందర్భాలు ఎన్నో.. క్రమంగా ఆ పరిస్థితి పోయింది.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం అయ్యింది.. వ్యాక్సిన్ సెంటర్లలోనే కాదు.. వార్డులు, గ్రామాలు.. అంతెందుకు పంట పొలాల్లో తిరుగుతూ కూడా వ్యాక్సిన్లు వేశారు. అయినా, ఇంకా వ్యాక్సిన్లు వేసుకోనివారి సంఖ్య భారీగానే ఉంది.. మరోవైపు వ్యాక్సిన్ నిల్వలు కూడా పెరిగిపోతున్నాయి.
Read Also: భారత్లో కరోనా థర్డ్వేవ్..! తాజా హెచ్చరికలు
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో, ఎండీగా గెబ్రెమారియం నియామకం
దేశవ్యాప్తంగా 23 కోట్లకు పైగా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని పార్లమెంట్లో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వినియోగించని టీకాలు 11 కోట్ల మేర నిల్వ ఉన్నాయని.. దేశవ్యాప్తంగా వీటి సంఖ్య 23 కోట్లకు పైగానే అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు తెలిపింది. ఇక, ఉత్తరప్రదేశ్లో ఒక్క డోసూ వేయించుకోని వారు 3.50 కోట్ల మంది ఉన్నారని.. బీహార్లో ఆ సంఖ్య 1.89 కోట్ల మంది, మహారాష్ట్రలో 1.71 కోట్ల మంది, తమిళనాడులో 1.24 కోట్ల మంది ఉన్నారని స్పష్టం చేసింది. మరోవైపు.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని అరికట్టడంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. ఇక, ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కన్షార్షియం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కాగా, ఇప్పటికే దేశవ్యాప్తంగా 125 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ జరగా.. 94 దేశాలకు 7.23 కోట్లకు పైగా డోసులను సరఫరా చేసింది భారత్. ఇక 150 దేశాలకు భారత్ నుంచి కోవిడ్ సంబంధింత మందులు, ఇతర సాయాన్ని అందించింది భారత్. ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో ప్రవేశంచడం.. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో.. వ్యాక్సిన్ వేసుకోనివారు ముందు ఆ పని చేయండి అంటూ ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. ఇప్పటికీ కొంతమంది వ్యాక్సిన్ సెంటర్లకు రావడంలేదు. దీంతో.. వారిలో అవగాహన కల్పించడంపై దృష్టిసారించింది సర్కార్.
తాజావార్తలు
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Smart TV: ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 43-ఇంచెస్ బ్రాండెడ్ LED స్మార్ట్ టీవీలు సగం ధరకే.. త్వరపడండి
ట్రెండింగ్
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!