Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Cinema News Cbi Ncb Ed Update On Sushant Singh Rajput Death Case

సుశాంత్ కేసులో సిబిఐ, ఈడీ, ఎన్‌సిబి ఏం తేల్చిందంటే ?

Published Date :June 14, 2021 , 1:50 pm
By Prakash
సుశాంత్ కేసులో సిబిఐ, ఈడీ, ఎన్‌సిబి  ఏం తేల్చిందంటే ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 14, 2020న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు చేస్తున్నాయి.

ఎందుకు సిబిఐ, ఎన్‌సిబి, ఈడి విచారణ ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం మధ్య రాజకీయ తుఫాను సృష్టించింది. ఆ తర్వాత కేంద్రం జోక్యం చేసుకుంది. దీంతో అతని మరణానికి సంబంధించిన కేసు దర్యాప్తు చేపట్టాలని సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివంగత నటుడి తండ్రి కెకె సింగ్… సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అందులో సుశాంత్ ను ఆత్మహత్య చేసుకునేలా రియా ప్రేరేపించిందని, సుశాంత్ ఖాతా నుండి రూ.15 కోట్లు మాయమయ్యాయని ఆరోపించారు. రియాపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తరువాత, మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రియాపై ఈడి కూడా కేసు నమోదు చేసింది. నటుడికి డ్రగ్స్ ఇచ్చినట్లు వాట్సాప్ చాట్స్ వెల్లడించడంతో ఎన్‌సిబి కూడా ఈ కేసులోకి అడుగు పెట్టింది.

సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎంత వరకూ వచ్చింది ?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తులో అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) పేర్కొంది. ఫెడరల్ ప్రోబ్ ఏజెన్సీ తన దర్యాప్తులో రియా చక్రవర్తి, ఆమె తండ్రి ఇంద్రజిత్, తల్లి, సోదరుడు షోయిక్, సుశాంత్ ఇంటి సిబ్బంది, అతని స్నేహితుడు సిద్ధార్థ్ పిథానితో సహా సుశాంత్ మాజీ వర్కర్స్, ముంబై పోలీస్, ఈ కేసును మొదట దర్యాప్తు చేసిన అధికారులు, గతంలో నటుడికి చికిత్స చేసిన వైద్యులు అందరినీ విచారించారు. ఆ తరువాత ఎయిమ్స్ నుండి ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో సిబిఐ క్రైమ్ ను రికన్స్ట్రక్షన్ చేశారు. ఆ తరువాత లభ్యమైన అన్ని ఆధారాలను పరీక్ష కోసం పంపించింది. సుశాంత్ విసెరా శాంపిల్స్, శవపరీక్ష నివేదికలను పరిశీలించిన ఎయిమ్స్ వైద్యుల బృందం ఇది హత్య కాదని, ఆత్మహత్య అని వెల్లడించింది.

ఈ కేసులో సరికొత్త శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి దర్యాప్తును సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు ఏజెన్సీ పేర్కొంది. డిజిటల్ పరికరాల్లోని డేటాను వెలికితీసేందుకు, విశ్లేషించడానికి, కేసుకు సంబంధించిన సంబంధిత సెల్ టవర్ స్థానాల డంప్ డేటాను విశ్లేషించడానికి తాజా సాఫ్ట్‌వేర్‌తో సహా అధునాతన మొబైల్ ఫోరెన్సిక్ పరికరాలను కూడా సిబిఐ ఉపయోగించింది. అంతేకాదు సుశాంత్ ఆత్మహత్యకు గల కారణాన్ని కనుగొనడానికి ఏజెన్సీ ఆయన మానసిక విశ్లేషణను కూడా చేస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఫెడరల్ ఏజెన్సీ అలీగర్, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, మనేసర్, పాట్నాలకు వెళ్లి సాక్ష్యాలను సేకరించి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. నటుడిపై శవపరీక్ష నిర్వహించిన కూపర్ హాస్పిటల్ వైద్యులను కూడా సిబిఐ ప్రశ్నించింది. వైద్యుల అభిప్రాయాలు, వాంగ్మూలాల ఆధారంగా ముంబై పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకుని మరణించారని చెప్పారు.

ఇక రియా చక్రవర్తి తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని, చనిపోయే ఆరు రోజుల ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారని చెప్పారు. 2020 జూన్ 9న సుశాంత్ తన అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్లిన ఒక రోజు తర్వాత రియా అతనిని బ్లాక్ చేసింది. మరోవైపు సుశాంత్ కుటుంబం ఆరోపించినట్లుగా సుశాంత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణం అనే ఆరోపణలకు సిబిఐ ఖచ్చితమైన ఆధారాలు కనుగొనలేకపోయింది.

ఈడీ ఇన్వెస్టిగేషన్… రూ. 5 కోట్లు ఏమయ్యాయి ?
సుశాంత్ అకౌంట్లోని రూ.15 కోట్లు రియా, ఆమె సోదరుడు షోయిక్ తీసుకున్నారని… సుశాంత్ కుటుంబం ఆరోపించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో రియా, ఆమె కుటుంబంలోని ఇతరుల స్టేట్మెంట్ ను ఈడీ నమోదు చేసింది. సుశాంత్‌తో అసోసియేట్ అయిన మూడు సంస్థలు రియా, ఆమె సోదరుడి భాగస్వామ్యంలో ఉన్నాయని, నటుడి ఖాతా నుండి అనేక లావాదేవీలు జరిగాయని ఈడీ కనుగొంది. కానీ సుశాంత్ ఖాతా నుండి రూ.15 కోట్లు రియా కొల్లగొట్టింది అనడానికి ఆధారాలను మాత్రం కనుక్కోలేకపోయింది.

ఎన్సిబి దర్యాప్తులో ఏం తేలింది ?
రియా వాట్సాప్ చాట్స్ లో డ్రగ్స్ గురించి బయటపడడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసు నమోదు చేసింది. ఈ కేసులో రియా, ఆమె సోదరుడు, ఇంకా అనేక మంది డ్రగ్ పెడ్లర్లను ఎన్‌సిబి అరెస్టు చేసింది. సుశాంత్‌ ఇంటిలోనే రియా, ఇంకా ఇతరులు అతనికి డ్రగ్స్ ఇచ్చారని ఆరోపించారు. కానీ రియా మాత్రం సుశాంత్ కు ముందే డ్రగ్స్ అలవాటు ఉందని, తనకు అతనికి మానసిక ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లానని, డాక్టర్ ఇచ్చిన మందులు మాత్రమే ఇచ్చానని తెలిపింది. అయితే సుశాంత్‌ మృతికి రియా ఇచ్చిన మందులు కారణమా ? లేదా ? అనే విషయాన్నీ తేల్చడంలో ఎన్‌సిబి విఫలమైంది. ఈరోజు సుశాంత్ వర్ధంతి కావడంతో ఆయన మృతికి న్యాయం జరగాలంటూ అభిమానులు కోరుతున్నారు. మరి ఎప్పటికి ఈ మిస్టరీ వీడుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sushanth
  • Sushanth Death Case
  • Sushanth Death Case Update
  • Sushanth Singh Rajput
  • Sushanth Suicide

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి..

  • Sri Lanka vs Pakistan: పాకిస్థాన్‌కు శ్రీలంక బిగ్ షాక్.. మ్యాచ్‌కు ముందే సెమీస్ రేసు నుంచి పాక్ అవుట్

  • Israel-Iran War: “హర్మూజ్ జలసంధి”ని మూసేసిన ఇరాన్.. ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం..

  • ONGC Share: ఇరాన్‌- ఇజ్రాయెల్ చమురు మంటలతో.. ONGC ఇన్వెస్టర్లకు పండగ?

  • Darren Sammy: “2016 రిపీట్ అవ్వడం పక్కా.. భారత్‌ను చిత్తు చేస్తాం”.. టీమిండియాకు వెస్టిండీస్ కోచ్ సవాల్!

  • Israel-Iran War: దుబాయ్ పామ్ జుమైరాపై ఇరాన్ క్షిపణి దాడి..

ట్రెండింగ్‌

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • Ragi Poori Recipe: డయాబెటిక్ పేషెంట్లకు బెస్ట్ బ్రేక్ ఫాస్ట్.. బంతిలా పొంగే ‘రాగి పూరీ’లు ఇలా చేయండి!

  • Planetary Alignment: ఆకాశంలో గ్రహాల సందడి.. ఒకే వరుసలో ఆరు గ్రహాలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions