Kaleshwaram Project: వివరాలు ఇవ్వండి.. నిర్మాణ సంస్థలను కోరిన జస్టిస్ పినాకి..
- కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ- అన్నారం- సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాయా?
- కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా?
- మూడు బ్యారేజీల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు
- దీనిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kaleshwaram Project: కాంట్రాక్టులు పొందిన నిర్మాణ సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాయా? లేక కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారా? దీనిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. మూడు బ్యారేజీల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్లు కమిషన్ కు కొన్ని ఆధారాలు సమర్పించినట్లు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఓ నాయకుడి సమీప బంధువుకు చెందిన ఓ కంపెనీ బ్యారేజీల పనులను కూడా సబ్ కాంట్రాక్ట్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Read also: Khammam: నా భార్యకు గుండె కుడివైపున ఉంది నాకొద్దు.. ఏం జరిగిందంటే..!
Also Read
దీంతో సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించాలని బ్యారేజీ నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించింది. నిర్మాణ సంస్థలు సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించకుంటే.. గత పదేళ్ల ఆర్థిక నివేదికలను సమర్పించాలని నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశిస్తుంది. నిర్మాణ సంస్థలు అనుమానిత సబ్కాంట్రాక్టర్లకు డబ్బు చెల్లించినట్లు ఈ ఆర్థిక నివేదికలు చూపించే అవకాశం ఉంది. నిర్మాణ సంస్థలు ఆర్థిక నివేదికలను కూడా సమర్పించకుంటే.. ఆ వివరాలను కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి తీసుకురావాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
Read also: Alcohol Drinking: మద్యం ఎక్కువగా తాగటం వల్ల లైంగిక సామర్థ్యం తగ్గుతుందా?
తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని రిటైర్డ్ ఇంజినీర్ల కమిటీ జస్టిస్ చంద్రఘోష్కి తెలిపింది. గోదావరిపై నిర్మించిన ప్రాజెక్టులపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం 2015లో రిటైర్డ్ సీఈలు బి.అనంతరాములు, వెంకటరామారావు, ఎస్.చంద్రమౌళి, రిటైర్డ్ ఎస్ఈలు జి.దామోదర్ రెడ్డి, ఎం.శ్యాంప్రసాద్ రెడ్డిలతో ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ వాదనలు వినిపించారు. జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో శ్యాంప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Read also: Heart Attack : హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే రోజూ వీటిని తినాలి..
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నివేదిక ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు తిరస్కరించారని, వాటిపై సంతకం కూడా చేయలేదని వివరించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించామన్నారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద 150-151 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక కాపీని కమిషన్కు అందజేశారు. కాగా.. 27 తర్వాత కేసీఆర్, హరీష్లకు ఫోన్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తుంది. తదుపరి దశలో అఫిడవిట్లలో వివిధ వ్యక్తులు సమర్పించిన సమాచారం ఆధారంగా బహిరంగ విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది.
Maharaja: బాక్సాఫీస్ వద్ద ‘మహారాజ’ ఊచకోత..ఒక్క రోజుకే 2 లక్షల బుకింగ్స్..
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!