Warangal Congress Clash: కమిటీ ముందుకు రావాలని.. నన్ను ఎవరు పిలవలేదు..
- కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి..
- క్రమశిక్షణ కమిటీకి 6 పేజీల లేఖ ఇచ్చిన మాజీ ఎమ్మెల్సీ మురళి..
- కమిటీ ముందుకు రావాలని.. నన్ను ఎవరు పిలవలేదు.. నేనే వచ్చాను: కొండా మురళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Warangal Congress Clash: హైదరాబాద్ లోని గాంధీ భవన్ కి అనుచరులతో వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రమశిక్షణ కమిటీకి ఆరు పేజీలతో కూడిన వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను కమిటి ముందుకు రండి అని ఎవరు పిలవలేదు.. పార్టీ మీద గౌరవంతో నేనే వచ్చాను అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు.. ఆయనకు ప్రత్యేక వర్గం లేదని వెల్లడించారు. నేను పిలిచినా నా దగ్గరికి వస్తారు.. ఇక, భూపాలపల్లి నుంచి నేనే పోటీ చేద్దాం అనుకున్నాను.. కానీ, కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి పోటీ చేస్తుంది కాబట్టి.. నేను పోటీ చేయొద్దని అనుకున్నా.. అక్కడ నాకు బలం ఉంది.. టీడీపీ నుంచి వచ్చిన గండ్ర వెంకటరమణారెడ్డికి మద్దతు ఇచ్చి గెలిపించాను.. ఇప్పుడు ఆయనే ఇతరులతో కలిసి నాకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు అని కొండా మురళి ఆరోపించారు.
Read Also: Pawankalyan : ‘హరిహర వీరమల్లు’ మేకర్స్ ప్లానింగ్పై పవన్ ఫ్యాన్స్ ఫైర్.. !
Also Read
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
ఇక, సీతక్కతో మాకు ఎలాంటి పంచాయతీ లేదు.. సీతక్క, సురేఖ కలిసి పని చేసుకుంటున్నారు అని కొండా మురళి తెలిపారు. కానీ కడియం శ్రీహరి పార్టీ లోకి వచ్చాకా.. సీతక్క, సురేఖకి మధ్య గ్యాప్ వచ్చిందని కడియం ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. అలాగే, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి కూడా మేమే మద్దతిచ్చి గెలిపించాం.. విజయం సాధించిన తర్వాత మాకు వ్యతిరేకంగా గూడు పుఠాని రాజకీయాలు చేస్తున్నారు అని మండిపడ్డారు. దీంతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఇందిరకు కడియం శ్రీహరి చుక్కలు చూపిస్తున్నాడు.. ఆమె వర్గీయులను కూడా టార్చర్ చేస్తున్నాడని తెలిపారు. 200 నుంచి 300 మంది కడియం వేధింపులు తట్టుకోలేక నాకు చెప్పారు.. నేను ఆయన నియోజకవర్గంలో ఇన్వాల్ కావడం లేదు.. కానీ, జిల్లాలో ఏం చేస్తున్నాడో యావత్ రాష్ట్రమంతా తెలుసు అన్నారు. ఇక, నన్ను ఎవరు పిలిచి ఈ విషయాలు చెప్పమని అడగలేదు.. మన పీసీసీ ప్రెసిడెంట్, బీసీ బిడ్డా మహేష్ కుమార్ మీద అభిమానంతో నేనే వచ్చి పార్టీకి వివరించాలని అనుకున్నాను.. అందుకే, స్వయంగా వచ్చి తెలియజేయడం జరిగిందని కొండా మురళి తెలిపారు.
తాజావార్తలు
-
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ ముగిసింది.. కొత్త సవాల్కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. నెక్ట్స్ ఆడే మ్యాచ్లు ఇవే..
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..