Pawan Kalyan: బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని నేను ఊహించలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక తెలంగాణ కావాలనుకుంటున్నానని.. బీసీలకు సాధికారికత తెలంగాణ కోరుకున్నామని తెలిపారు. ధన బలం లేకున్నా.. మీ ధైర్యం, మీ సహకారంతో జనసేన నడిపిస్తూ వస్తున్నానని చెప్పారు. 2014లో మోదీని ప్రధానిగా చూడాలని ఆయనకు అప్పుడు బలంగా మద్దతు ఇచ్చానన్నారు. అదే స్ఫూర్తితో ఈసారి కూడా ఇక్కడి బీజేపీ నేతలకు అదే మద్దతు ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీ తరుపున పోటీ చేస్తున్న ప్రదీప్ రావును మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు.
YS Sharmila: కేసీఆర్, మోదీల చీకటి ఒప్పందాలకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది..: వైఎస్ షర్మిలా
Also Read
- ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
- GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
- Warangal: సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏసీబీ రైడ్.. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ల అక్రమ సంపదలు బట్టబయలు..!
- Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!
ఇన్ని రోజులు తెలంగాణా ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదని నన్ను చాలా మంది అడిగారని పవన్ కల్యాణ్ తెలిపారు. కానీ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం పైన విమర్శలు చేయవద్దు అని అనుకున్నానని చెప్పారు. ఉద్యమ పోరాటంతో, సకల జనుల సమ్మెతో, ప్రజల బలిదానంతో సాధించిన తెలంగాణ రాష్టంలో తప్పులు లేకుండా ఉంటుంది అని భావించానని చెప్పుకొచ్చారు. దశాబ్దం పాటు పెదవి మెదపలేదని.. అయితే 10 ఏళ్ళు గడిచిన తెలంగాణలో మార్పు రాలేదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నపుడు నేను తెలంగాణకు వస్తా అనుకున్నా.. ఇప్పుడు ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నరు అందుకే వచ్చానని పేర్కొన్నారు.
ఆంధ్రాలో ఎలా తిరుగుతున్నానో తెలంగాణాలో అలాగే తిరుగుతానని పవన్ కల్యాణ్ చెప్పారు. బీసీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే తెలంగాణలో తిరుగుతని అన్నారు. మహిళ మాన, ప్రాణాల కోసం తెలంగాణలో పర్యటిస్తానని తెలిపారు. తెలంగాణలో కూడా జనసేన ఉంటుందని పవన్ అన్నారు. బలిదానాలు ఇచ్చిన తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో కమిషన్ తీసుకుంటున్నారని నేతలు చెబుతున్నారు.. అంటే ఇక్కడ అవినీతి ఎంత ఉందో అర్ధం అవుతుందని పవన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని తండాలకు వెళ్ళితే కనీసం త్రాగడానికి నీళ్లు కూడా లేవన్నారు. అలాగే తెలంగాణ యువత పూర్తిగా మనసూర్తిగా కోరుకుంటే అనుకున్నది సాధించవచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు.
Captain Miller: ఏది సామీ ఈ అరాచకం.. ధనుష్ విశ్వరూపం.. దడుచుకుంటారేమో
ఆంధ్రాలో రౌడీలు రాజ్యామేలుతున్నారని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. అక్కడ గుండాల పాలన నడుస్తోందని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో తట్టుకుని నిలబడుతున్నానంటే వరంగల్ పోరాటస్ఫూర్తే కారణమన్నారు. బలిదానాల తెలంగాణలో ఇంత అవినీతి ఉంటుందని తాను ఊహించలేదన్నారు. తెలంగాణలో కమీషన్ల రాజ్యం నడుస్తోందని పవన్ తెలిపారు. కాగా.. ఆంధ్రా జన్మనిస్తే తెలంగాణ పునర్ జన్మ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో తాను ఒక్కడినని అన్నారు. తెలంగాణలో జనసేన ఉంటుంది.. తెలంగాణలో బీజేపీతో కలిసి పనిచేస్తామని పవన్ తెలిపారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే జనసేన స్థాపించామని చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థులు రావుపద్మ, ప్రదీప్ రావును గెలిపించండని కోరారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!