Vijayashanti: పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బడ్జెట్పై సెటైర్లు వేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి… పేరు గొప్ప.. ఊరు దిబ్బలా బడ్జెట్ ఉందంటూ ఎద్దేవా చేసిన ఆమె.. బడ్జెట్ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య, వైద్య రంగానికి చాలా తక్కువ శాతం కేటాయించారు. రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.. గతంలో కేటాయించిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా ఖర్చు చేసింది ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆమె.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించారని ఆరోపించారు.. ఇక, సభ నుంచి బీజేపీ ఎమ్యెల్యేలను సస్పెండ్ చేయడం సరైంది కాదని దుయ్యబట్టిన రాములమ్మ.. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి డిమాండ్ చేశారు.
Read Also: DCGI: గుడ్న్యూస్.. చిన్నారుల వ్యాక్సిన్కు అనుమతి
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
బడ్జెట్ అంటే కేసీఆర్ సర్కార్ విలువ లేకుండా చేసిందని ఫైర్ అయ్యారు రాములమ్మ.. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానాస్పదంగా ఉందన్న ఆమె.. అన్నీ గాలి లెక్కలు చూపించారు. విద్యా వ్యవస్థలో మౌలిక వసతులకు తప్ప, టీచర్ల భర్తీ గురించి చెప్పలేదు. అలాగే కార్పొరేషన్లకు నిధులు లేవన్నారు… ప్రతి అంకెకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఉపాధికి సంబంధించిన ప్రస్తావన బడ్జెట్లో లేదు. ముందుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలి. ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకోవడం సరైంది కాదన్న ఆమె.. రైతుబంధు, భీమా లాంటి పథకాలకు తప్ప, వ్యవసాయరంగంలో మిగతా వాటికి కేటాయింపులు లేవన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని మండిపడ్డ ఆమె.. తెలంగాణను తెగనమ్మితేగాని ఆదాయం రాని పరిస్థితి నెలకొందన్నారు.. భూములు, జాగాలు అమ్మాలి. లిక్కర్ తాగించాలి… లేదంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. ఏడేండ్లలో ఏడు రెట్లు అప్పులు చేసి రుణభారాన్ని రూ.5 లక్షల కోట్లకు చేర్చారని వామర్శించారు.. ఏడాదికి రూ.30 వేల కోట్లు అప్పుల మిత్తీలకే సరిపోతే… ఇక రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అని ప్రశ్నించిన ఆమె.. బంగారు తెలంగాణ చేసిన… అని చెప్పుకొంటున్న దొరగారు, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎవరికోసం చేశారు? అని నిలదీశారు విజయశాంతి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!