Vijayashanti: పేరు గొప్ప.. ఊరు దిబ్బలా ఉంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బడ్జెట్పై సెటైర్లు వేశారు బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి… పేరు గొప్ప.. ఊరు దిబ్బలా బడ్జెట్ ఉందంటూ ఎద్దేవా చేసిన ఆమె.. బడ్జెట్ అనేది ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే విద్య, వైద్య రంగానికి చాలా తక్కువ శాతం కేటాయించారు. రెవెన్యూ ఖర్చులకు కూడా అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని విమర్శించారు.. గతంలో కేటాయించిన బడ్జెట్ ఎంత? వాస్తవంగా ఖర్చు చేసింది ఎంతో బయటపెట్టాలని డిమాండ్ చేసిన ఆమె.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయించారని ఆరోపించారు.. ఇక, సభ నుంచి బీజేపీ ఎమ్యెల్యేలను సస్పెండ్ చేయడం సరైంది కాదని దుయ్యబట్టిన రాములమ్మ.. వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి డిమాండ్ చేశారు.
Read Also: DCGI: గుడ్న్యూస్.. చిన్నారుల వ్యాక్సిన్కు అనుమతి
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
బడ్జెట్ అంటే కేసీఆర్ సర్కార్ విలువ లేకుండా చేసిందని ఫైర్ అయ్యారు రాములమ్మ.. ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అనుమానాస్పదంగా ఉందన్న ఆమె.. అన్నీ గాలి లెక్కలు చూపించారు. విద్యా వ్యవస్థలో మౌలిక వసతులకు తప్ప, టీచర్ల భర్తీ గురించి చెప్పలేదు. అలాగే కార్పొరేషన్లకు నిధులు లేవన్నారు… ప్రతి అంకెకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఉపాధికి సంబంధించిన ప్రస్తావన బడ్జెట్లో లేదు. ముందుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతి తీసుకోవాలి. ఎంతో కొంత బడ్జెట్ కేటాయించి చేతులు దులుపుకోవడం సరైంది కాదన్న ఆమె.. రైతుబంధు, భీమా లాంటి పథకాలకు తప్ప, వ్యవసాయరంగంలో మిగతా వాటికి కేటాయింపులు లేవన్నారు.. ఇక, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేశారని మండిపడ్డ ఆమె.. తెలంగాణను తెగనమ్మితేగాని ఆదాయం రాని పరిస్థితి నెలకొందన్నారు.. భూములు, జాగాలు అమ్మాలి. లిక్కర్ తాగించాలి… లేదంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి ఉంది. ఏడేండ్లలో ఏడు రెట్లు అప్పులు చేసి రుణభారాన్ని రూ.5 లక్షల కోట్లకు చేర్చారని వామర్శించారు.. ఏడాదికి రూ.30 వేల కోట్లు అప్పుల మిత్తీలకే సరిపోతే… ఇక రాష్ట్రాన్ని ఎలా నడుపుతారు? అని ప్రశ్నించిన ఆమె.. బంగారు తెలంగాణ చేసిన… అని చెప్పుకొంటున్న దొరగారు, రూ.5 లక్షల కోట్ల అప్పు ఎవరికోసం చేశారు? అని నిలదీశారు విజయశాంతి.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!