Vemula Prashanth Reddy : నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు మోడీ అని ఆయన అన్నారు. 5జీ స్పెక్ట్రం వేలంలో 15లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో 3లక్షల కోట్ల కుంభ కోణం జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో పాటు.. మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపద దోచి పెడుతున్నాడని ఆయన మండిపడ్డారు. కేసిఆర్ పాలన గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అరవింద్ పత్తాలేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : British Airways: బ్రిటీస్ ఎయిర్వేస్లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో నిలిచిన విమానాలు..
Also Read
దేశంలో ఈ రాష్ట్రంలో లేని దళిత బంధు, బీడీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, రైతుబంధు, తదితర పథకాలను కెసిఆర్ ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ప్రారంభించడానికి బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందని, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తమయ్యారన్నారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అక్కడి ప్రజలకు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పారని, పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Also Read : Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!