Vemula Prashanth Reddy : నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా నందిపేటలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ అసమర్థ ప్రధాని అని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. ప్రపంచంలోనే అత్యంత అవినీతి రాజకీయ నాయకుడు మోడీ అని ఆయన అన్నారు. 5జీ స్పెక్ట్రం వేలంలో 15లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని, ఆస్ట్రేలియా బొగ్గు దిగుమతి పేరుతో 3లక్షల కోట్ల కుంభ కోణం జరిగిందని ఆయన ఆరోపించారు. దీంతో పాటు.. మోడీ తన కార్పొరేట్ మిత్రులకు దేశ సంపద దోచి పెడుతున్నాడని ఆయన మండిపడ్డారు. కేసిఆర్ పాలన గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేసిన అరవింద్ పత్తాలేడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : British Airways: బ్రిటీస్ ఎయిర్వేస్లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో నిలిచిన విమానాలు..
Also Read
దేశంలో ఈ రాష్ట్రంలో లేని దళిత బంధు, బీడీ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, రైతుబంధు, తదితర పథకాలను కెసిఆర్ ప్రవేశపెట్టి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ప్రారంభించడానికి బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుందని, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తమయ్యారన్నారు. మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అక్కడి ప్రజలకు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పారని, పేద ప్రజల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Also Read : Virender Sehwag: అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ బుగ్గిపాలు చేశాడు.. తీసిపారెయ్యండి
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!