Congress Party: ఆయనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు.. పార్టీ చీఫ్పై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్రెడ్డి..
కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.. అయితే, త్వరలోనే పూర్తిస్థాయిలో అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ తరుణంలో గాంధీయేతర కుటుంబానికి చెందిన కొందరు సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి… మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని స్పష్టం చేశారు.. భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఏఐసీసీ ఎన్నికలున్నాయి.. గుజరాత్ అసెంబ్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్నాయని.. మేమంతా రాహుల్ గాంధీని ఒప్పించి ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉండేలా చూస్తామన్నారు.. ఇక, ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీయేతరవ్యక్తి వుంటాడని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Read Also: Team India: ఆసియా కప్ కోసం ఆడారా? ప్రయోగాల కోసం ఆడారా?
Also Read
ఇక, రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతాడు.. ఇందులో నాకు ఎలాంటి సందేహాలు లేవన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి… తెలంగాణలోకి పాదయాత్ర ఎంటరైనప్పుడు వేలాదిమందితో రాహుల్ జోడో యాత్రకు స్వాగతం పలుకుతామన్న ఆయన.. బీజేపీని అణగదొక్కడానికి భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కాగా, కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు. తమిళనాడులోని కన్యకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర సాగే ఈ సుదీర్ఘ పాదయాత్ర.. ఇవాళ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కలిసి నడుద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం.. అనే నినాదంతో రాహుల్ జోడో యాత్ర సాగనుంది. పక్షపాత రాజకీయాలకు, మతోన్మాదానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి, అసమానతలకు, జీవనోపాధి విధ్వంసానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఈ ర్యాలీ సాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
-
Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
-
Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!