Congress Party: ఆయనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు.. పార్టీ చీఫ్పై క్లారిటీ ఇచ్చిన ఉత్తమ్ కుమార్రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పార్టీ జాతీయ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగుతున్నారు.. అయితే, త్వరలోనే పూర్తిస్థాయిలో అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.. ఈ తరుణంలో గాంధీయేతర కుటుంబానికి చెందిన కొందరు సీనియర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి… మా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయేనని స్పష్టం చేశారు.. భారత్ జోడో యాత్ర జరుగుతున్నప్పుడు ఏఐసీసీ ఎన్నికలున్నాయి.. గుజరాత్ అసెంబ్లీతో పాటు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు కూడా ఉన్నాయని.. మేమంతా రాహుల్ గాంధీని ఒప్పించి ఏఐసీసీ అధ్యక్షుడుగా ఉండేలా చూస్తామన్నారు.. ఇక, ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీయేతరవ్యక్తి వుంటాడని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Read Also: Team India: ఆసియా కప్ కోసం ఆడారా? ప్రయోగాల కోసం ఆడారా?
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
ఇక, రాహుల్ గాంధీనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అవుతాడు.. ఇందులో నాకు ఎలాంటి సందేహాలు లేవన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి… తెలంగాణలోకి పాదయాత్ర ఎంటరైనప్పుడు వేలాదిమందితో రాహుల్ జోడో యాత్రకు స్వాగతం పలుకుతామన్న ఆయన.. బీజేపీని అణగదొక్కడానికి భారత్ జోడో యాత్ర ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. కాగా, కాంగ్రెస్కు పూర్వ వైభవం తీసుకురావడం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సిద్ధమయ్యారు. తమిళనాడులోని కన్యకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు 150 రోజుల పాటు 3,500 కిలోమీటర్ల మేర సాగే ఈ సుదీర్ఘ పాదయాత్ర.. ఇవాళ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. కలిసి నడుద్దాం.. దేశాన్ని ఏకం చేద్దాం.. అనే నినాదంతో రాహుల్ జోడో యాత్ర సాగనుంది. పక్షపాత రాజకీయాలకు, మతోన్మాదానికి, పెరుగుతున్న నిరుద్యోగానికి, అసమానతలకు, జీవనోపాధి విధ్వంసానికి వ్యతిరేకంగా దేశ ప్రజలందరినీ ఏకం చేస్తూ ఈ ర్యాలీ సాగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..